పాకిస్థాన్లో(Pakistan) సైన్యాధికారాల విస్తరణకు దారితీసే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ పార్లమెంట్ 27వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్కు విస్తృత అధికారాలు లభించనున్నాయి. త్వరలోనే ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ బిల్లుకు పార్లమెంట్లో మూడింట రెండొంతులకుపైగా మెజార్టీ లభించగా, కేవలం కొద్ది మంది సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. ఇప్పటికే ఎగువ సభ ఆమోదం తెలిపిన ఈ బిల్లు రాష్ట్రపతి సంతకం అనంతరం చట్టంగా మారనుంది.
Read Also: TTD: కల్తీనెయ్యి వ్యవహారం – మాజీ చైర్మన్ వైవి నోరువిప్పితే ఏం జరుగుతుందో?
న్యాయ వ్యవస్థపై ప్రభావం
Pakistan: సవరణ ప్రకారం, రాజ్యాంగ సంబంధిత కేసులను పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు (FCC) ఏర్పాటుకానుంది. దీని ద్వారా సుప్రీం కోర్టు అధికార పరిధి తగ్గిపోనుంది. ఈ కోర్టులో న్యాయమూర్తుల నియామకాన్ని ప్రభుత్వం స్వయంగా నిర్వహించనుంది.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, సుప్రీం కోర్టు ఇటీవల ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇచ్చిన తీర్పుల వల్లే ఈ మార్పు తీసుకువచ్చారని చెబుతున్నారు.
ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల స్పందన
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయాన్ని “జాతీయ ఐక్యతకు చారిత్రాత్మక అడుగు”గా పేర్కొన్నారు. అయితే, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
వీరు బిల్లుపై ఓటింగ్ సమయంలో వాకౌట్ చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచే చర్యగా ఈ సవరణను అభివర్ణించారు.
ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు ఏర్పాటు సరైన నిర్ణయమే అని మీరు భావిస్తున్నారా?
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: