📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: అసత్యాలతో పరువుకోసం పాకులాడుతున్న పాకిస్థాన్

Author Icon By Sharanya
Updated: June 9, 2025 • 1:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశం ఇటీవల చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా తీసుకుని సమర్థవంతంగా నాశనం చేయడంపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చర్యల పట్ల ఓవైపు ఉగ్రవాదానికి ఎదురుదెబ్బతగలడమనే భయంతో, మరోవైపు అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని పాకిస్థాన్ వరుసగా తప్పుడు ప్రచారాలకే మళ్లింది.

ఆదంపూర్ విమాన స్థావరం పై పాక్ ఆరోపణలు

అత్యాధునిక ఎస్-400 క్షిపణి (S-400 missile) వ్యవస్థతో కూడిన పంజాబ్ రాష్ట్రంలోని ఆదంపూర్ (Adampur) వాయుసేన స్థావరంపై తాము దాడి చేశామని పాకిస్థాన్ తాజాగా చెబుతోంది. గతంలో కూడా ఇదే తరహాలో పలు ఆరోపణలు చేసింది. ఆదంపూర్ లోని ఎస్-400 వ్యవస్థను ధ్వంసం చేశామని పాక్ ఆరోపించింది. మార్ఫింగ్ చేసిన ఫొటోలతో ప్రచారం చేసుకుంది. అయితే, ఆదంపూర్ లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎస్-400 క్షిపణి విధ్వంసక వ్యవస్థ ముందు నిలబడి ప్రసంగించడం ద్వారా పాక్ ప్రచారాన్ని తిప్పికొట్టారు.

ప్రధాని మోదీ ప్రత్యక్షంగా బలమైన ఖండన

అయితే, ఈ ప్రచారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తిప్పికొట్టారు. ఆయ‌న ఇటీవల ఆదంపూర్‌ విమాన స్థావరాన్ని సందర్శించి, అక్కడి సైనికులతో మాట్లాడారు. ముఖ్యంగా ఎస్-400 వ్యవస్థ ముందు నిలబడి ప్రసంగించడం ద్వారా పాకిస్థాన్ తప్పుడు ఆరోపణలను కొట్టి పారేశారు. ఈ దుష్ప్రచారంతో పాకిస్థాన్ అంతర్జాతీయంగా నవ్వులపాలైంది. అయినప్పటికీ బుద్ధి మార్చుకోని పాకిస్థాన్ తాజాగా మరో ఫేక్ ఫొటోతో ఆదంపూర్ వైమానిక స్థావరంలోని సుఖోయ్ యుద్ధ విమానాన్ని నాశనం చేశామని చెబుతోంది.

డిజిటల్ దౌర్జన్యానికి భిన్నంగా

అయితే, ప్రముఖ జియో-ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు డేమియన్ సైమన్ పాక్ చేస్తున్న తప్పుడు ఆరోపణలను శాస్త్రీయంగా విచ్ఛిన్నం చేశారు. గత నెలలో జరిగిన నాలుగు రోజుల సైనిక ఘర్షణకు రెండు నెలల ముందు, అంటే మార్చి 2025లో తీసిన శాటిలైట్ చిత్రాన్ని సైమన్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఒక మిగ్-29 విమానం మరమ్మతులో ఉండటం, ఇంజిన్ టెస్ట్ ప్యాడ్ వద్ద కనిపించే నల్లటి మసి సాధారణమైనదేనని ఆయన స్పష్టం చేశారు.

Read also: Pakistan: పంటలు ఎండి తీవ్ర కష్టాల్లో పాక్ రైతులు

Imran: రెండు రోజుల్లో జైలు నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ విడుదల..?

#AdampurAirbase #AshamedPakistan #GeoIntelligence #IndianAirForce #narendramodi #OperationSindoor #PakistanFakeNews #S400 Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.