📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Pakistan: బాబోయ్! ఉగ్ర సంస్థలతో మైనర్ బాలుడు సంబంధాలు.. అరెస్టు

Author Icon By Rajitha
Updated: January 6, 2026 • 3:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం దాడితో భారత్ తలపెట్టిన ఆపరేషన్ సిందూర్ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయి, ప్రపంచదేశాల విమర్శలతో అవమానభారంతో ఉన్న పాకిస్తాన్ ఏవిధంగానైనా భారత్ ను దెబ్బకొట్టాలనే ఆలోచనలతోనే ఉంటున్నది. ఇందులో భాగమే ఢిల్లీలో కారుపేలుడుతో ఉగ్రదాడికి పాల్పడింది. అంతేకాక ముస్లిం వైద్యులను కూడా ఉగ్రవాదులు తమవైపు తిప్పుకుని, దేశంలో
అనేకుల హత్యకు కుట్రపడింది. అయితే ఢిల్లీలో (Delhi) జరిగిన పేలుడు దాడులతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయినా కేంద్ర ప్రభుత్వం దేశంలో అన్నిచోట్ల తనిఖీలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్న పలువురిని అరెస్టు చేసింది.

Read also: Supreme court :ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై కీలక తీర్పు

Pathankot police arrest 15 year old minor involved in ISI espionage case

ఉగ్రముఠాతో సంబంధం ఉన్నవారు, ఉగ్రవాదులకు మద్దతుదారులను గుర్తించి అధికారులు అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పాక్ కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ ఐ కోసం గూఢచర్యం చేస్తున్న 15 ఏళ్ల బాలుడిని పఠాన్ కోట్ పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూలోని సాంబా జిల్లాకు చెందిన బాలుడు దాదాపు ఏడాదిగా ఐఎస్ ఐ ఏజెంట్లతో టచ్ లో ఉంటూ.. భారత సైనిక స్థావరాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని వారికి లీక్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అరెస్టు చేసిన బాలుడితో పాటు పంజాబ్ కు చెందిన పలువురు మైనర్లకు కూడా ఐఎస్ ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.

బాలురలపై చర్యలకు సిద్ధమైన అధికారులు

దీంతో వెంటనే పంజాబ్ లోని అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పాక్ తో సంబంధాలు కొనసాగిస్తోన్న ఇతర బాలురను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం పంజాబ్ లోని మైనర్ల ఆన్ లైన్ కార్యకలాపాలు, కదలికలపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. భారత యువతను లక్షనయం చేసుకోవడానికి పాక్ నిఘా సంస్థ పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. దేశాన్ని ఆస్థిరపరిచేందుకు, యువతలో భారత వ్యతిరేక కార్యకలాపాలను ప్రేరేపించేందుకు ఐఎస్ ఐ ఏజెంట్లు పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ISI latest news Minor Arrest National Security Telugu News Terrorism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.