📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan : పాకిస్థాన్‌లో వర్ష బీభత్సం .. 300 మంది మృతి

Author Icon By Sudha
Updated: August 4, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌ (Pakistan) ప్రస్తుతం చరిత్రలోనే అరుదైన రీతిలో రుతుపవనాల వల్ల దెబ్బతింటోంది. గత నెల రోజులుగా కుండపోత వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో దేశం మొత్తం వరదల్లో మునిగిపోతోంది. వర్షాల తీవ్రతతో రోడ్లు, వంతెనలు, నివాస గృహాలు నీటమునిగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుతుపవనాల ప్రభావంతో నెల రోజులకు పైగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.ఈ వర్షాలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు 300 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. వర్ష బీభత్సానికి (rain disaster) రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వందలాది ఇండ్లు దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది.

Pakistan : పాకిస్థాన్‌లో వర్ష బీభత్సం .. 300 మంది మృతి

పాక్‌ (Pakistan)విపత్తు నిర్వహణ సంస్థ పంచుకున్న డేటా ప్రకారం.. జూన్‌ 26 నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 299 మంది మరణించారు. ఇందులో 140 మంది చిన్నారులే ఉండటం కలచివేస్తోంది. ఇక ఈ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో దేశ వ్యాప్తంగా 715 మంది గాయపడ్డారు. అందులో 239 మంది చిన్నారులు కాగా, 204 మంది మహిళలు, 272మంది పురుషులు ఉన్నారు. రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి 1,676 ఇండ్లు దెబ్బతిన్నాయి. 562 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 428 మూగజీవాలు కూడా మృత్యువాత పడ్డాయి. రానున్న మూడు రోజులు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

పాకిస్తాన్లో వేసవిలో అనేక నదులకు వరదలు ఎందుకు వస్తాయి?

ఈ బేసిన్‌లో వరదలకు రుతుపవనాల వర్షపాతం ప్రధాన కారణం. కరిగే నీటి రేటు పెరగడం మరియు రుతుపవన వర్షాల కారణంగా వేసవిలో అధిక ప్రవాహాలు సంభవిస్తాయి.

1950 లో పాకిస్తాన్లో ఏ వరద వచ్చింది?

1950లో కురిసిన వర్షాలకు దేశవ్యాప్తంగా 2,900 మంది మరణించారని అంచనా . రావి నది వరదలు వచ్చినప్పుడు లాహోర్ నగరంతో సహా పంజాబ్ ప్రావిన్స్ అత్యంత దెబ్బతిన్న వాటిలో ఒకటి. దక్షిణ ప్రావిన్స్ సింధ్‌లోని కొన్ని ప్రాంతాలను కూడా వరదలు ప్రభావితం చేశాయి.

పాకిస్తాన్ పట్ల చైనాకు ఎందుకు అంత ఆసక్తి ఉంది?

చైనా మరియు పాకిస్తాన్ మధ్య బలమైన సైనిక సంబంధాలు ఉన్నాయి. రెండు పొరుగు తూర్పు-దక్షిణాసియా దేశాల మధ్య ఈ పొత్తు భౌగోళిక రాజకీయంగా ముఖ్యమైనది. బలమైన సైనిక సంబంధాలు ప్రధానంగా ప్రాంతీయ భారతీయ మరియు అమెరికన్ ప్రభావాన్ని ఎదుర్కోవడమే కాకుండా, ఈ ప్రాంతంలో సోవియట్ ప్రభావాన్ని తిప్పికొట్టడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Read hindi news hindi.vaartha.com:

Read Also: Pakistan: ఇరాన్ న్యూక్లియర్ కు పాకిస్తాన్ మద్దతు

Breaking News death toll Floods latest news monsoon rains Natural Disaster Pakistan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.