పాకిస్తాన్(Pakistan) మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ నాయకుడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan) గురించి బుధవారం నుంచి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. రావల్పిండిలోని అదియాలా జైలు నుండి ఆయనను ఎక్కడికో మార్చారని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తూ, ఆయన ఆరోగ్యం పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఇమ్రాన్ ఖాన్ గత రెండేళ్లుగా అదియాలా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. సుమారు 190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసులో ఆయనకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఇదే సమయంలో, ఆయనను తరలించారనే ప్రచారాన్ని ఆయన సోదరి అలీమా ఖాన్ ఖండించారు.
Read Also: Muslim Votes: ముస్లింలు BJPకు ఓటు ఇవ్వకపోవడం పై విశ్లేషణ
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు
జైలు అధికారులు కూడా ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఆరోగ్యంగా ఉన్నారని, కోర్టు గైడ్లైన్స్ ప్రకారం అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో కూడా ఇమ్రాన్ ఖాన్ గురించి ఇలాంటి వదంతులు చెలరేగినప్పటికీ, ఆయన కుటుంబ సభ్యులకు గత మూడు వారాలుగా భేటీకి అనుమతి ఇవ్వలేదన్న సమాచారం కొత్త అనుమానాలకు కారణమైంది.
ఇమ్రాన్ ఖాన్కు సన్నిహితుడైన జుల్ఫీ బుఖారీ మాట్లాడుతూ, “ఆయన్ని తరలించారంటే కుటుంబానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు? కోర్టు అనుమతి ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులను ఎందుకు కలిసనివ్వడం లేదు?” అని ప్రశ్నించారు. ఆయన ప్రకారం ఈ పరిస్థితి ఆందోళనకరం మరియు చట్టపరంగా సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
జైలు వద్ద నినాదాలు
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలలో పీటీఐ నాయకులు, కార్యకర్తలు అదియాలా జైలు వద్ద నినాదాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ వదంతుల ఎక్కువ భాగం భారత్, అఫ్గాన్ ఖాతాల నుంచి వచ్చాయని పీటీఐ ఆరోపిస్తోంది. అందువల్ల ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని పార్టీ డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ను జైలు నుండి ఇతర ప్రాంతానికి మార్చారనే వార్తలను ఖండించింది. ఆయన జైలులోనే సురక్షితంగా ఉన్నారని, వైద్యులు తరచూ సాధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని పంజాబ్ సమాచార మంత్రి అజ్మా బుఖారీ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: