📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India expels Pak employee : పాక్‌ హైకమిషన్‌ ఉద్యోగి బహిష్కరణ.. 24 గంటల్లోగా వెళ్లిపోవాలి :భారత్‌

Author Icon By Sudha
Updated: May 14, 2025 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌ హైకమిషన్‌ ఉద్యోగిని దేశం నుంచి బహిష్కరించింది. 24 గంటల్లోగా భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశం జారీ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

India expels Pak employee : పాక్‌ హైకమిషన్‌ ఉద్యోగి బహిష్కరణ.. 24 గంటల్లోగా వెళ్లిపోవాలి :భారత్‌

గూఢచర్య కార్యకపాలకు పాల్పడుతునే ఆరోపణలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌లో పాకిస్థాన్‌ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అధికారికి భారత విదేశాంగ శాఖ ఓ లేఖ రాసింది. అయితే, ఆ అధికారి పేరును మాత్రం వెల్లడించలేదు. దిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగిని దేశ బహిష్కరణ చేయాలని నిర్ణయించామని విదేశాంగ శాఖ తెలిపింది. అధికార హోదాకు తగ్గట్లు ప్రవర్తించలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. 24 గంటల్లోగా సదరు అధికారి భారత్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అధికారిని భారత ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఈ మేరకు పాకిస్థాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్​కు మంగళవారం ఆదేశాలు జారీ చేశామని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉన్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తారు. కాగా, పహల్గాం ఉగ్రవాది తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా పాక్​పై భారత్ ఆపరేషన్ సిందూర్​ పేరుతో దాడులు చేసింది. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది.

Read Also : Pakistan On PM Modi Speech: కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటున్నాం: పాక్

Breaking News in Telugu Google news Google News in Telugu india Latest News in Telugu must leave within 24 hours Pakistan High Commission employee expelled Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.