Pakistan Floods: పాక్ లో వరదల బీభత్సం.. 270 మంది మృతి

Read Time:  1 min
Pakistan Floods: పాక్ లో వరదల బీభత్సం.. 270 మంది మృతి
FONT SIZE
GET APP

పాకిస్థాన్ (Pakistan Floods) లో గతకొన్ని రోజులుగా ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాలకు అతలాకుతమైపోయింది. ఇస్లామాబాద్ (Islamabad) సహా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరదల వల్ల జనజీవనం స్తంభించింది. ఇప్పటివరకు వరదల వల్ల 270మంది మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. పలు ఇళ్లు వరదల దాటికి కొట్టుకునిపోవడంతో అనేక మందికి నివాసం లేకుండా అయిపోయింది. తీవ్రవర్ష బీభత్సంతో రోడ్లు జలమయమైపోయాయి. బ్రిడ్జిలు కూలిపోవడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నివాసాన్ని కోల్పోయిన ప్రజలు సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. ఆహారం, నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార లావాదేవీలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు మార్కెట్లో కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారు.

అప్రమత్తమైన ప్రభుత్వం

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇళ్లలో వరదనీరు (Floodwater in houses)రావడంతో ప్రభుత్వం యుద్ధ ప్రాదిపతికంగా చర్యలు తీసుకుంటున్నది. ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నది. అధిక వర్షాలకు ఇప్పటివరకు దాదాపు 270 మంది మరణించినట్లు అక్కడి అధికారులు చెప్పారు. అసలే యుద్ధంతో ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్ (Pakistan Floods) ఈ అధికవర్షాలతో మరింతగా దిగజారిపోయింది. ఇతర దేశాల నుంచి కూడా ఆశించిన సాయం అందకపోవడంతో సామాన్యుల వ్యతలు వర్ణనాతీతంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Donald Trump: వలసలపై మరోసారి నోరుపారేసుకున్న ట్రంప్

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.