Pakistan economic : పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. చమురు దిగుమతులపై ఆధారపడిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.
కట్టుబాటు చర్యలు ప్రకటించిన ప్రభుత్వం
ఈ నేపథ్యంలో దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కఠిన ఆస్టరిటీ చర్యలను ప్రకటించారు. దేశంలో ప్రభుత్వ కార్యాలయాలు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయనున్నట్లు తెలిపారు. అయితే బ్యాంకులు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు, ఆసుపత్రులు వంటి అత్యవసర సేవలకు ఈ నిర్ణయం వర్తించదు.
ఇంధన వినియోగంపై ఆంక్షలు
ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని 60% వరకు తగ్గించాలని నిర్ణయించారు. అలాగే రెండు వారాల పాటు ప్రభుత్వ వాహనాలకు కేటాయించే పెట్రోల్ను 50% తగ్గించనున్నారు. అంబులెన్స్లు, ప్రజా రవాణాకు మాత్రం ఈ కోత వర్తించదు.
Read Also: Pawan Kalyan: ‘ఉస్తాడ్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఫిక్స్
జీతాల్లో కోతలు
ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా కోతలు విధించారు.
- మంత్రులు: రెండు నెలల పాటు ఎలాంటి జీతం తీసుకోరు
- ఎంపీలు: జీతాల్లో 25% కోత
- ప్రభుత్వ అధికారులు: రూ.3 లక్షలకు పైగా వేతనం పొందేవారికి 20% కోత
- ప్రభుత్వ శాఖలు: నిర్వహణ ఖర్చులు 20% తగ్గింపు
విదేశీ పర్యటనలపై నిషేధం
ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ప్రధాని, మంత్రులు, గవర్నర్లు, ఉన్నతాధికారుల విదేశీ పర్యటనలపై కూడా తాత్కాలిక నిషేధం విధించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విదేశీ పర్యటనలకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: