భారత్‌కు వ్యతిరేకంగా పాక్ , చైనా కుమ్మక్కు : ఆర్మీ చీఫ్

Read Time:  1 min
Pakistan, China colluding against India.. Army Chief
Pakistan, China colluding against India.. Army Chief
FONT SIZE
GET APP

న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్‌లు భారత్‌కు వ్యతిరేకంగా కుమ్మక్కవుతున్నాయని సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండింటి మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలున్నాయన్న వాస్తవాన్ని భారత్‌ తప్పక అంగీకరించాలన్నారు. ఈ మేరకు ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. రెండు వైపుల నుంచి దేశానికి ముప్పు పొంచి ఉందన్నారు. సైనిక సన్నద్ధత, సరిహద్దుల వెంబడి పరిస్థితులు, బంగ్లాదేశ్‌ అంశం తదితరాల గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

భారత్‌కు వ్యతిరేకంగా పాక్ , చైనా

సన్నిహిత సంబంధాలు మనకు ఆందోళనకరం

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాల గురించి ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదానికి ఆ దేశం (పాక్‌) కేంద్రబిందువు. అందువల్ల మనకు పొరుగునున్న ఏ దేశంతోనైనా ఆ దేశం సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం మనకు ఆందోళనకరం. ఇందుకు కారణం.. ఆ దేశాన్ని కూడా ఉగ్రవాద చర్యలను ఉపయోగించుకునే అవకాశం ఉండటమే అని ద్వివేది పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌కు సంబంధించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటవుతుందన్నారు.

మనకు యుద్ధ ముప్పు ఉందనేది వాస్తవం

అయితే భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య సైనిక బంధం బలంగానే ఉందని చెప్పారు. చైనా, పాకిస్థాన్‌ల మధ్య వ్యూహాత్మక బంధం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. వర్చువల్‌ వేదికలపై ఆ రెండు దేశాల మధ్య బంధం వందశాతంగా ఉంది. భౌతికంగా పరిశీలిస్తే.. చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాక్‌ వినియోగిస్తోంది. కుమ్మక్కుకు సంబంధించి నేడున్న పరిస్థితి ఇది. దీన్నిబట్టి రెండువైపుల నుంచి ఏకకాలంలో మనకు యుద్ధ ముప్పు ఉందనేది వాస్తవం అని ఆర్మీ చీఫ్‌ పేర్కొన్నారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.