ప్రస్తుతం ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ (Asif Munir)అమెరికా పర్యటన కొత్త చర్చలకు దారితీస్తోంది. ఆయన వాషింగ్టన్ వచ్చిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో (Donald Trump) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వైట్హౌస్ కేబినెట్ రూమ్లో వీరిద్దరికీ విందు ఏర్పాటు కావడం అరుదైన విషయం. సాధారణంగా సైన్యాధినేతలకు ఇలా అగ్రరాజ్యం గౌరవం ఇవ్వడం చాలా ప్రత్యేకం.ఈ భేటీ కొద్దిపాటి సందర్శనలా కనిపించినా, మూసివేసిన తలుపుల వెనక అత్యంత కీలక చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పీక్కు చేరిన సమయంలో, పాకిస్థాన్కు ఇరాన్తో ఉన్న సంబంధాలు ఈ భేటీకి ప్రాధాన్యతనిచ్చాయి. జనరల్ మునీర్కు ఇచ్చిన గౌరవాన్ని పాక్ ప్రభుత్వం దౌత్యపరంగా గొప్ప విజయంగా పరిగణిస్తోంది. ఇలాంటి ఆహ్వానం గతంలో కేవలం పాకిస్థాన్ మాజీ అధ్యక్షులకే మాత్రమే లభించింది.
భారత్-పాక్ విషయంలో ట్రంప్ పాత పాటే
ఇదిలా ఉంటే, ట్రంప్ మళ్లీ భారత్-పాక్ సమస్యపై తన జోక్యం గురించి వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా తన ప్రయత్నాలు కీలకమైయ్యాయని అన్నారు. మునీర్, మోదీ ఇద్దరూ నిశ్చలంగా వ్యవహరించడంతో యుద్ధాన్ని నివారించగలిగామని పేర్కొన్నారు.
మోదీ ఫోన్కాల్, ట్రంప్-అమెరికా తిరుగు ప్రయాణం
జీ7 సదస్సు తర్వాత ట్రంప్ అకస్మాత్తుగా అమెరికాకు తిరిగొచ్చారు. ఆ వెంటనే ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. అమెరికా వెళ్లమని మోదీని ఆహ్వానించినా, ఆయనకు ఇప్పటికే నిర్ణయించిన కార్యాక్రమాల కారణంగా అదేవిధంగా జరగలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
Read Also : IndiGo : 40 నిమిషాల పాటూ విమానంలోనే ఛత్తీస్గఢ్ మాజీ సీఎం : ఎందుకంటే?