పాకిస్తాన్(Pakistan) లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు రికార్డుస్థాయికి చేరడంతో, దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ప్రస్తుతం టమాటా ధర కిలో రూ.600 చేరింది. అంటే 400శాతం కంటే ఎక్కువ పెరుగుదల. ఈ పెరుగుదల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దుస్థితిని, ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోంది.
Read Also: Trump: ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్
పార్లమెంట్ లో టమాటా రచ్చ పాకిస్తాన్ పార్లమెంటులో(Parliament) టమాటా రుణం అనే పదం పెద్ద చర్చకు దారితీసింది. ఒక ఎంపీ తన ప్రసంగంలో చేతిలో టమాటాను పట్టుకుని.. ఈ టమాటాను నేను చాలా కష్టపడి తెచ్చుకున్నాను. దీని ధర రూ.75 అని చెప్పడం వీడియో రూపంలో వైరల్ అయింది. ఆ వ్యాఖ్య వ్యంగ్యంగా చేసినప్పటికీ అది దేశ ప్రజల ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించింది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైంది అంటూ విమర్శించింది.
స్తంభించిన వాణిజ్యం
ఈనెల 11 నుండి పాకిస్తాన్(Pakistan)-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణల పాయింట్లు మూసివేయడంతో కూరగాయల దిగుమతులు ఆగి పోయాయి. రాయిటర్స్ ప్రకారం.. ఈ మూసివేత నల్ల రెండు దేశాలు రోజుకు సుమారు 1 మిలియన్ అమెరికన్ డాలర్లు నష్టపోతున్నాయి. సుమారు 5వేల కంటెనర్లు సరిహద్దు వద్ద ఇరుక్కుపోయాయి. వాటిలో చాలావాటి కూరగాయలు చెడిపోయాయి.
భారీగా నష్టాలు
పాకిస్తాన్-ఆఫ్ఘన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఖాన్ జాన్ అలోకోజాయ్ మాట్లాడుతూ ప్రతిరోజూ 500 కంటెనర్లు ఎగుమతికి సిద్ధం ఉండేవి, కానీ ఇప్పుడు అవి వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. టమాటోతో పాటు వెల్లుల్లి కిలో రూ. 400, అల్లం రూ. 750, ఉల్లిపాయలు రూ.120, బఠానీలు రూ.500, బబెండకాయలు, క్యాప్సికమ్ రూ.300, క్యారెట్లు రూ.200, నిమ్మకాయలు రూ.300గా పెరిగాయి. దీంతో నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు వీటిని కొనుగోలు చేసేందుకు కష్టతరంగా మారింది. ప్రజలు కడుపునిండా మూడుపూటలు తినేందుకు కూడా నోచుకోవడం లేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: