📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: ఒక్క టమాటా ఖరీదు రూ.75.. ఆదుకోవాలంటూ భారత్కు రెక్వస్ట్

Author Icon By Pooja
Updated: October 29, 2025 • 2:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్(Pakistan) లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు రికార్డుస్థాయికి చేరడంతో, దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ప్రస్తుతం టమాటా ధర కిలో రూ.600 చేరింది. అంటే 400శాతం కంటే ఎక్కువ పెరుగుదల. ఈ పెరుగుదల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దుస్థితిని, ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోంది.

Read Also: Trump: ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్

Pakistan: ఒక్క టమాటా ఖరీదు రూ.75.. ఆదుకోవాలంటూ భారత్కు రెక్వస్ట్

పార్లమెంట్ లో టమాటా రచ్చ పాకిస్తాన్ పార్లమెంటులో(Parliament) టమాటా రుణం అనే పదం పెద్ద చర్చకు దారితీసింది. ఒక ఎంపీ తన ప్రసంగంలో చేతిలో టమాటాను పట్టుకుని.. ఈ టమాటాను నేను చాలా కష్టపడి తెచ్చుకున్నాను. దీని ధర రూ.75 అని చెప్పడం వీడియో రూపంలో వైరల్ అయింది. ఆ వ్యాఖ్య వ్యంగ్యంగా చేసినప్పటికీ అది దేశ ప్రజల ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించింది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైంది అంటూ విమర్శించింది.

స్తంభించిన వాణిజ్యం

ఈనెల 11 నుండి పాకిస్తాన్(Pakistan)-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణల పాయింట్లు మూసివేయడంతో కూరగాయల దిగుమతులు ఆగి పోయాయి. రాయిటర్స్ ప్రకారం.. ఈ మూసివేత నల్ల రెండు దేశాలు రోజుకు సుమారు 1 మిలియన్ అమెరికన్ డాలర్లు నష్టపోతున్నాయి. సుమారు 5వేల కంటెనర్లు సరిహద్దు వద్ద ఇరుక్కుపోయాయి. వాటిలో చాలావాటి కూరగాయలు చెడిపోయాయి.

భారీగా నష్టాలు

పాకిస్తాన్-ఆఫ్ఘన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఖాన్ జాన్ అలోకోజాయ్ మాట్లాడుతూ ప్రతిరోజూ 500 కంటెనర్లు ఎగుమతికి సిద్ధం ఉండేవి, కానీ ఇప్పుడు అవి వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. టమాటోతో పాటు వెల్లుల్లి కిలో రూ. 400, అల్లం రూ. 750, ఉల్లిపాయలు రూ.120, బఠానీలు రూ.500, బబెండకాయలు, క్యాప్సికమ్ రూ.300, క్యారెట్లు రూ.200, నిమ్మకాయలు రూ.300గా పెరిగాయి. దీంతో నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు వీటిని కొనుగోలు చేసేందుకు కష్టతరంగా మారింది. ప్రజలు కడుపునిండా మూడుపూటలు తినేందుకు కూడా నోచుకోవడం లేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Food Inflation Latest News in Telugu Pakistan Economy Today news Tomato prices

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.