📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: PAK VS AFGHAN:  పాక్-ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం

Author Icon By Sushmitha
Updated: October 27, 2025 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాక్-అఫ్ఘన్(PAK VS AFGHAN) సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరంతరం రెండు దేశాలు పరస్పర దాడులకు తెగబడుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఆఫ్ఘానిస్తాన్ చేతిలో చావుదెబ్బ తిన్న పాక్ కు ఇంకా బుద్ధిరావడం లేదు. తాజాగా ఖైబర్ పట్తుంఖ్వా సమీపంలో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు తెలిసింది. అఫ్గాన్(Afghan) వైపు 25మంది ఉగ్ర వాదులు చనిపోయారని పాక్ సైన్యం తెలిపింది. అయితే చనిపోయింది ఉగ్రవాదులా(Terrorist) తాలిబన్ దళాలా అనే విషయం తెలియాల్సి ఉంది. తమ భూభాగంలో ప్రవేశించే ఉగ్రవాదులను అరికట్టిన పాక్ కుర్రం, ఉత్తర వజీరిస్తాన్ జిల్లాల్లో సరిహద్దులను దాటి ఉగ్రవాదులు పాక్ లోకి ప్రవేశిస్తుండగా దాడులు చేసినట్లు సైన్యం వివరించింది. నలుగురు ఆత్మాహుతి బాంబర్ల సహా 25 మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ భద్రతా.

Read Also: H1B Visa: మా దేశంలో మీ పెత్తనమెందుకు.. గో బ్యాక్.. సీఈఓ తీవ్ర వ్యాఖ్యలు

దళాలు కాల్చి చంపినట్లు సైన్యం వివరించింది.

 ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.అయితే ఈ దాడులపై అఫ్గానిస్థాన్ ఇంకా స్పందించలేదు.పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్న తెహ్రీక్ ఏ తాలిబాన్ కాగా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు తెహ్రీక్ ఏ తాలిబాన్ (టిటీపీ) అనే సంస్థ దాడులకు పాల్పడుతున్నది. టీటీపీ ఉగ్రవాద స్థావరాలన్నీ ఆఫ్ఘనిస్థాన్ లోనే ఉన్నాయని పాక్ ఆరోపించింది.

ఇటీవలే కాబూల్ నగరంపై పాక్ సైన్యం(army) వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్ బోర్డర్ మూసివేయడంతో అఫ్గాన్ వ్యాపారులు ప్రతి రోజు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడే స్తంభించడంతో సరకుల సరఫరా చేసేందుకు కష్టతరమవుతోంది. దీని ప్రభావంతో రెండు దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ట్రంప్ చొరవతీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఉగ్రవాదులను ఎక్కడ హతమార్చారు?

పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

ఈ ఉద్రిక్తతలకు కారణం ఏమిటి?

సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటు మరియు పాకిస్థాన్ సైన్యంపై జరుగుతున్న దాడులే ఈ ఉద్రిక్తతలకు కారణం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Border clash Counter-Terrorism geopolitical tensions Google News in Telugu Latest News in Telugu Military operation Pakistan-Afghanistan border Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.