ఇటీవల పాక్, (Pak) ఆఫ్ఘాన్ లమధ్య దాడులు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి ఆఫ్ఘనిస్థాన్ భారత్ తో తన స్నేహసంబంధాలను పెంపొందించుకోవడం పాక్ కు ఏమాత్రం గిట్టడం లేదు. అందుకే మాటిమాటికి పాక్ ఆదేశంపై దాడులకు పాల్పడుతూ, అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్నది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ పై మరోసారి పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పదిమంది మరణించగా నలుగురు గాయపడినట్లుగా ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.
Read Also: Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
సోమవారం రాత్రి 12గంటల సమయంలో ఖోస్ట్ ప్రావిన్స్ లోని గోర్బుజ్ జిల్లాలో దాడి జరిగినట్లుగా ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం తెలిపారు. 9మంది పిల్లలు చనిపోయినట్లుగా పేర్కొన్నారు. అనంతరం చికిత్స పొందుతూ మహిళ కూడా చనిపోయినట్లుగా వెల్లడించారు. మొత్తంగా పదిమంది మరణించినట్లు తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా మాజీ రాయబారి జల్మయ్ ఖలీల్దాద్
దౌత్యానికి పిలుపునిచ్చిన అమెరికా మాజీ రాయబారి కునార్, పార్టికాలో వైమానికి దాడులు జరిగాయని.. ఇక్కడ నలుగురు పౌరులు గాయపడినట్లు తెలిపారు. తాజా దాడుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా (America) మాజీ రాయబారి జల్మయ్ ఖలీల్దాద్ దౌత్యానికి పిలుపునిచ్చారు. ఇక ఇరుదేశాల మధ్య సయోధ్య కోసం టర్కీకి చెందిన ఒక బృందం ఇస్లామాబాద్, కాబూల్ లో పర్యటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గత కొద్దిరోజులుగా రెండు దేశాలమధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ భారత్ తో సఖ్యతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆఫ్ఘనిస్థాన్ పై పాక్ వైమానిక దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: