ఢిల్లీ కారు పేలుడు తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ ఐఎ (NIA) అధికారుల దాడులు ముమ్మంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రధాన నగరాలు, జిల్లాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గతకొన్ని రోజుల క్రితం హర్యానాలో భారీ ఎత్తున పేలుడు పదార్థాల తయారీని నిఘా సంస్థలు స్వాధీనం చేసుకున్న ఘటన మరువకముందే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఇంటర్నేషనల్ ఆయుధాల రవాణా రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. ముఠా పాకిస్థాన్ (Pak) నుంచి డ్రోన్ల సాయంతో అక్రమంగా ఆయుధాలను భారత్ కు తరలిస్తున్నట్టు గుర్తించారు. వీరు పంజాబ్ సరిహద్దుల గుండా డ్రోన్ ల ద్వారా పాకిస్తాన్ నుంచి ఆయుధాలను సేకరించి వాటిని లారెన్స్ బిష్లో గ్యాంగ్ కు ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు పోలీసులు కనుగొన్నారు.
Read Also: Amrutham 2.0: ఒరేయ్ ఆంజనేలూ… వచ్చేస్తోంది..!

పోలీసుల అదుపులో నలుగురు
గ్యాంగ్ స్టర్లకు ఆయుధాలు సరఫరా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసింది ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వీళ్లు లారెన్స్ బిష్ణోయ్, బంబీహా, గోగీ, హిమాంశు భౌ గ్యాంగ్ లకు సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ స్మగ్లింగ్ గ్యాంగ్ కు పాకిస్తాన్ ఐఎస్ ఐతో సంబంధాలు ఉన్నట్లు, పాకిస్తాన్ మార్గంగా టర్కీ, చైనా దేశాల్లో తయారైన హై-ఎండ్ పిస్టల్స్ భారత్ కు సప్లై అవుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు.
వీరినుంచి 10 దేశీయ విలువైన పిస్టల్స్, 92 బుల్లెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి మొబైల్ రికార్డులు, బ్యాంకు వివరాలు, సోషల్ మీడియా ఆధారంగా మిగతా సభ్యుల లింకులు, వారి నెట్ వర్క్ను కూడా దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. పాక్ నిత్యం భారత్ పై దాడులు చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నది. కానీ పైకిమాత్రం ఉగ్రవాదులతో తమకేమీ సంబంధం లేదని బుకాయించేందుకు యత్నిస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: