పాకిస్థాన్లోని అస్థిర ప్రాంతమైన బలూచిస్థాన్ ప్రావిన్స్లో రక్తపాతం చెలరేగింది. వేర్పాటువాద గ్రూపు అయిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మరియు పాకిస్థాన్ భద్రతా బలగాల మధ్య జరిగిన భీకర దాడుల్లో ఇప్పటివరకు 125 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా, ప్రావిన్స్లోని దాదాపు 12 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగాయి. BLA రెబల్స్ వ్యూహాత్మకంగా సైనిక స్థావరాలు, రవాణా మార్గాలు మరియు పౌర నివాసాలపై మెరుపు దాడులు చేయడంతో ఈ స్థాయిలో ప్రాణనష్టం సంభవించింది.
HYD : హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..ఇందులో విశేషాలు మాములుగా లేవు !!
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ హింసాత్మక ఘటనల్లో 18 మంది భద్రతా సిబ్బంది మరియు 15 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 92 మంది మృతులు మిలిటెంట్లేనని పాక్ భద్రతా దళాలు ప్రకటించాయి. రైల్వే ట్రాక్లను పేల్చివేయడం, రహదారులపై వాహనాలను తనిఖీ చేసి పౌరులను కాల్చిచంపడం వంటి దారుణాలకు BLA పాల్పడింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం బలూచిస్థాన్లో పరిస్థితి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదని సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, అదనపు బలగాలను రంగంలోకి దించింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) వంటి భారీ ప్రాజెక్టుల వల్ల తమ ప్రాంత వనరులు దోపిడీకి గురవుతున్నాయన్న ఆగ్రహంతో BLA ఈ తరహా దాడులకు పాల్పడుతోంది. ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా, రెబల్స్ దాడులు కొనసాగుతుండటంతో ఆ ప్రాంతం ప్రస్తుతం యుద్ధ క్షేత్రంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com