Latest News: Pak-Afghan: పాక్–ఆఫ్ఘాన్ కాల్పుల విరమణ

Read Time:  1 min
Pak-Afghan
Pak-Afghan
FONT SIZE
GET APP

Pak-Afghan: పాకిస్తాన్‌ సైన్యం ఆఫ్ఘనిస్తాన్‌ భూభాగంలో నిర్వహించిన వైమానిక దాడులు సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతను పెంచాయి. ఈ దాడుల్లో పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆఫ్ఘన్ వర్గాలు ఆరోపించగా, పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల స్థావరాలపైనే దాడులు చేసినట్లు ప్రకటించింది.దాడులకు గంటల ముందు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Khawaja Asif), ఆఫ్ఘన్ గడ్డ నుంచి తమ దేశంపై ఉగ్రదాడులను ఇకపై సహించబోమని హెచ్చరించడం గమనార్హం.

Read also: Indian Railways: జంటలకు ప్రత్యేక రైలు సౌకర్యం

మధ్యవర్తిత్వం వహించిన గల్ఫ్ దేశాలు

దాడుల కారణంగా ఇరు దేశాల సైన్యాలు సరిహద్దు పోస్టులపై పరస్పరం కాల్పులు జరిపి, యుద్ధ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతలు అధికమవుతుండడంతో సౌదీ అరేబియా మరియు ఖతార్ మధ్యవర్తిత్వం చేపట్టాయి. ఈ చర్చల తర్వాత, రెండు దేశాలు 48 గంటల తాత్కాలిక కాల్పుల విరమణ పాటించేందుకు అంగీకరించాయి.పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ప్రకారం, ఈ కాల్పుల విరమణ 15వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది.

డ్యూరాండ్ లైన్ వివాదం మూల కారణం

ఇది గత ఆరు నెలల్లో రెండోసారి కాల్పుల విరమణ(Pak-Afghan) ఒప్పందం కుదరడం. ఇరు దేశాల మధ్య దాదాపు శతాబ్ద కాలంగా కొనసాగుతున్న డ్యూరాండ్ లైన్ సరిహద్దు వివాదం ఈ ఘర్షణలకు ప్రధాన కారణంగా కొనసాగుతోంది.నిపుణుల ప్రకారం, తాజా కాల్పుల విరమణ తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, శాంతి స్థిరపడేందుకు దీర్ఘకాలిక రాజకీయ పరిష్కారం అవసరమని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Radha

రచయిత గురించి

Radha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.