📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : Pak-Afghan : పాక్‌-అఫ్ఘాన్‌ బార్డర్‌ క్లోజ్‌..

Author Icon By Sudha
Updated: October 24, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ (Pak-Afghan) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘర్షణల నేపథ్యంలో అక్టోబర్‌ 11 నుంచి ఇరుదేశాల సరిహద్దులను మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో రవాణా ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రెండు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మీట్‌, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ఘర్షణల తర్వాత పాకిస్థాన్‌లో టమాటా ధరలు దాదాపు ఐదు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర 700 పాకిస్థానీ రూపాయలు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అఫ్గాన్‌ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే ఆపిల్‌ ధరలు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం.

Read Also : California: కాలిఫోర్నియాలో రోడ్డు ప్రమాదం చేసిన ట్రక్​ డ్రైవర్​ అరెస్ట్

Pak-Afghan

పాక్‌- అఫ్గాన్‌ మధ్య ఏటా 2.3 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని.. ఘర్షణల నేపథ్యంలో సరిహద్దుల్లో రవాణా, వాణిజ్యం ఆగిపోయిందని కాబూల్‌లోని పాక్-అఫ్గాన్ (Pak-Afghan)ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ తెలిపారు. అఫ్గాన్‌ నుంచి పాక్‌కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు పాడైనట్లు చెప్పారు. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5వేల కంటైనర్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) నష్టం వాటిల్లుతుందన్నారు.

ఆఫ్ఘనిస్తాన్ జనాభా ఎంత?

2024 నాటికి ఆఫ్ఘనిస్తాన్ మొత్తం జనాభా దాదాపు 35.7 మిలియన్లుగా అంచనా వేయబడింది. 2025 నాటికి ఇది సుమారు 44.5 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఆఫ్ఘనిస్తాన్ బహుళ జాతి మరియు బహుళ భాషా సమాజంతో కూడిన దేశం. 

భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు పేరు ఏమిటి?

1893లో ఆఫ్ఘనిస్తాన్ ఎమిరేట్ మరియు బ్రిటిష్ ఇండియన్ సామ్రాజ్యం మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా డ్యూరాండ్ రేఖను ఇండియన్ సివిల్ సర్వీస్ యొక్క బ్రిటిష్ దౌత్యవేత్త మోర్టిమర్ డ్యూరాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఎమిర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ స్థాపించారు, వారి వారి ప్రభావ రంగాల పరిమితిని నిర్ణయించడానికి మరియు మెరుగుపరచడానికి..

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

afghanistan border Breaking News international- latest news Pakistan security Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.