📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindoor : త్రివిధ దళాల పరాక్రమాన్ని చూసి పాక్‌ తట్టుకోలేకపోయింది ..రాజ్‌నాథ్‌ సింగ్‌

Author Icon By Sudha
Updated: July 28, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) విషయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్‌ ద్వారా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విజయవంతంగా దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భారీ స్థాయిలో ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటనల ప్రకారం, ఆపరేషన్‌ సిందూర్‌ను(Operation Sindoor) తాత్కాలికంగా విరమించామేగానీ, ఇది పూర్తి కావడం జరగలేదు. పాకిస్తాన్ వైపు నుంచి మరెక్కడైనా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగితే లేదా భారత్‌పై మళ్లీ దాడులు జరిగితే, మరింత గట్టిగా ప్రతీకారం ఉంటుందని ఆయన హెచ్చరించారు.

Operation Sindoor : త్రివిధ దళాల పరాక్రమాన్ని చూసి పాక్‌ తట్టుకోలేకపోయింది ..రాజ్‌నాథ్‌ సింగ్‌

లోక్‌సభలో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడారు. త్రివిధ దళాల పరాక్రమాన్ని చూసి పాక్‌ తట్టుకోలేకపోయిందని చెప్పారు. వెంటనే కాళ్ల బేరానికి వచ్చిందన్నారు. పాక్‌ డీజీఎంవో వెంటనే భారత్‌ను సంప్రదించినట్లు చెప్పారు. ‘మన సైనిక దళం చేసిన ఖచ్చితమైన దాడుల తర్వాత పాక్‌ కాళ్లబేరానికి వచ్చింది. ఓటమిని అంగీకరించింది. యుద్ధాన్ని ఆపాలని ప్రతిపాదించింది. ప్రస్తుతానికి ఈ ఆపరేషన్‌ను ఆపాం. భవిష్యత్తులో పాకిస్థాన్‌ దాడులకు పాల్పడితే.. గట్టిగా బదులిస్తాం’ అని రాజ్‌నాథ్‌ హెచ్చరించారు. పాక్‌ దాడులను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని రాజ్‌నాథ్‌ తెలిపారు. పాక్‌ నుంచి వచ్చిన అన్ని దాడులను ఎదుర్కొన్నట్లు చెప్పారు. మన వాయుసేన పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు. సైనిక సత్తాను ప్రశ్నించడం విపక్షాలకు సరికాదని రక్షణమంత్రి మండిపడ్డారు. భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (Operation Sindoor)విజయవంతమైందని లోక్‌సభలో గట్టిగా చెప్పారు. సైనిక చర్యలపై ప్రశ్నలు వేసేటప్పుడు ఆచితూచి, ఆలోచించి ప్రశ్నించాలని విపక్షాలకు సూచించారు.

ఆపరేషన్ సిందూర్ అంటే ఏమిటి?

నియంత్రణ రేఖ వెంబడి మరియు పాకిస్తాన్ లోపలి భాగంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేసేందుకు శిక్షాత్మక మరియు లక్ష్యంగా చేసుకున్న ప్రచారంగా ఆపరేషన్ సిందూర్‌ను రూపొందించారు.

సిందూర్ ఆపరేషన్‌లో ఎంత మంది ఉగ్రవాదులు మరణించారు?

తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు నిర్మూలించబడ్డాయి: లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ మరియు హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ మరియు కాశ్మీర్ (PoJK)లోని తొమ్మిది ప్రధాన ఉగ్రవాద లాంచ్ప్యాడ్‌లను భారతదేశం విజయవంతంగా ధ్వంసం చేసింది. చర్యలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు.

ఆపరేషన్ సింధూర్ కు ఎవరు నాయకత్వం వహించారు?

కల్నల్ సోఫియా ఖురేషి బుధవారం కల్నల్ సోఫియా ఖురేషి మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు. మే 7, 2025న తెల్లవారుజామున 1:44 గంటలకు దాడులు ప్రారంభమయ్యాయి మరియు ఉగ్రవాద గ్రూపులైన జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్), లష్కరే-ఎ-తోయిబా (ఎల్‌ఇటి) మరియు హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్‌ఎం) లతో సంబంధం ఉన్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Loksabha : లోక్ సభలో నేడు ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక చర్చ

Breaking News Indian Air Force Indian Army Indian Navy latest news Operation Sindoor Rajnath Singh Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.