📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindhur: మెరుపు దాడులకు ముందే ఇండియా ఆర్మీ విడుదల చేసిన వీడియో!

Author Icon By Ramya
Updated: May 7, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆపరేషన్ సిందూర్ విజయవంతం: పాకిస్తాన్‌పై మెరుపుదాడులతో ప్రతీకారం తీర్చుకున్న భారత్

ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు నిర్భందంగా 26 మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత భారత్ తీవ్రంగా స్పందించడంతో పాటు, దాడికి పాల్పడిన వారిని, వారికి మద్దతు ఇచ్చిన వారిని కచ్చితంగా భారత్ శిక్షిస్తుందంటూ చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వం చెబుతూనే వస్తోంది. ఆ ప్రకటనను కార్యరూపంలో చూపిస్తూ మంగళవారం రోజు అర్ధరాత్రి భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరుతో భారీ సైనిక దాడులు చేపట్టింది.

ఈ ఆపరేషన్‌లో సైన్యం, వాయుసేన, నౌకాదళం సమిష్టిగా పాల్గొని పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రత్యేకంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్, బిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థల శిబిరాలపై దాడులు నిర్వహించాయి. భారత ఆర్మీ ఈ దాడులను అర్ధరాత్రి 1.44 గంటలకు ప్రారంభించింది. సమాచారం ప్రకారం, ఈ మెరుపుదాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.

ముందు హెచ్చరికగా విడదల చేసిన వీడియో.. వైరల్ అవుతున్న సందేశం

దాడులు చేయడానికి సరిగ్గా 16 నిమిషాల ముందు.. సర్జికల్ స్ట్రైక్స్ జరుపుతున్న వీడియోను షేర్ చేశారు. అందులో ఐ ఫౌండ్ యూ త్రు ది డస్ట్ అండ్ స్టార్మ్ అంటూ వాయిస్ వినిపిస్తుండగా.. భారత ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్న వీడియో ప్లే అవుతోంది. అలాగే ఈ వీడియోని షేర్ చేస్తూ.. రెడీ టు స్ట్రైక్, ట్రైయిన్డ్ టు విన్ అని రాసుకొచ్చారు. దాడికి ముందే ఇండియన్ ఆర్మీ ఈ వీడియో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈక్రమంలోనే భారత ఆర్మీ ముందుగానే దాడి చేయబోతున్నట్లు చెప్పి.. ఆపై చేసి చూపించిందంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రజలు దీన్ని చూసి భారత ఆర్మీ ధైర్యాన్ని, సాంకేతిక సమర్థతను ప్రశంసిస్తున్నారు. “ఇది కేవలం ప్రతీకారం కాదు, ఒక హెచ్చరిక. ఇకపై భారత్‌ను వేధించిన వారికి తగిన గుణపాఠం తప్పదు” అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read also: Operation Sindoor On Pakistan: ఉగ్రవాదంపై భారత్‌ హక్కుగా పోరాటం: విక్రమ్ మిస్రీ

#IndiaFightsTerror #indianarmy #Jai Hind #Operation_Sindoor #Pahalgam_Retaliation #PakistanTerrorCamps #ReadyToStrike #SurgicalStrike2025 #TrainedToWin Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.