ఈ ఏడాది మే మాసంలో భారత్-పాకిస్తాన్ లమధ్య ఆపరేషన్ సిందూర్ యుద్ధం (war) జరిగింది. ఈ యుద్ధంలో భారత్ దే పైచేయిగా నిలిచింది. నాలుగురోజులు యుద్ధం తర్వాత పాక్ అభ్యర్థన మేరకు రెండుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య 2026లో యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులను సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ నివేదిక తెలిపింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (సిఎఫ్ ఆర్) సాయుధ సంఘర్షణ అవకాశాలను సంభావ్యత ఉందని చెప్పింది. ఇది అమెరికన్ ప్రయోజనాలపై పరిమిత ప్రభావం చూపొచ్చని తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాల పెరుగుదల కారణంగా భారత్, పాక్ మధ్య తిరిగి సాయుధ సంఘర్షణకు అవకాశం ఉన్నట్లు సీఎఫ్ ఆర్ ఆన్ కాన్స్టిక్ట్ వాచ్ ఇన్ 2026 నివేదికలో పేర్కొంది. భారత్ తో మాత్రమే కాకుండా, పాక్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా సాయుధ ఘర్షణ జరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.
Read also: Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థినుల మృతి
Operation Sindhur
ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించి పాక్ వ్యాప్తంగా ఉన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలు, వాటి కార్యాలయాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాక్ సైన్యం, భారత్ పై దాడులకు ప్రయత్నిస్తే, పాక్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 11 ఎయిర్ బేసుల్ని భారత్ క్షిపణులు ఢీకొట్టి ధ్వంసం చేశాయి. దీని తర్వాత, తాజాగా థింక్ ట్యాంక్ నుంచి ఈ నివేదిక వచ్చింది.
చలి, మంచు కారణంగా భారత్లో వచ్చే అవకాశం
జమ్మూ కాశ్మీర్ లో చలి, మంచు తీవ్రత అధికంగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడే అవకాశం ఉంది. జమ్మూలో ఇప్పటికే 30మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులు పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో, జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రెండుదేశాలు కూడా తమ రక్షణ పరికరాల కొనుగోలును వేగవంతం చేశాయి. డ్రోన్లు, ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, గైడెడ్ బాంబులను కొనుగోలు చేయడానికి భారతదేశ రక్షణ శాఖ ఇటీవల రూ.79,000కోట్ల విలువైన కొనుగోళ్లను ఆమోదించింది. అదేవిధంగా పాకిస్తాన్ ఆపరేషన్ సిందూర్ లో దెబ్బతిన్న తర్వాత చైనా, టర్కీల నుంచి కొత్త డ్రోన్లు, వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు చర్చలు ప్రారంభించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: