ఈ వారంలో అంతర్జాతీయంగా ఐటీ రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనైన సంగతి విదితమే. దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు జరగడంతో..ప్రపంచ మార్కెట్లలో సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల మేర మార్కెట్ విలువ క్షణాల వ్యవధిలోనే ఆవిరైపోయింది. దీనికి ప్రధాన కారణం ఆంత్రోపిక్ సంస్థ విడుదల చేసిన ఒక కొత్త AI సాధనం అని చర్చకు వచ్చింది. క్లాడ్ కోవర్క్ కోసం రూపొందించిన ఓపెన్-సోర్స్ లీగల్ ప్లగిన్ మార్కెట్లోకి రావడంతో.. టెక్ రంగంలో అనిశ్చితి పెరిగింది. దీనివల్ల సర్వీస్నౌ, సేల్స్ఫోర్స్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.ఈ ప్రభావం భారత మార్కెట్లపై కూడా పడింది.
Read Also: AI and employment future : ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? టెక్ దిగ్గజాలు ఇచ్చిన క్లారిటీ!
రాయిటర్స్ కథనం ప్రకారం..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి ప్రముఖ ఐటీ కంపెనీలను కలిగి ఉన్న భారత సాఫ్ట్వేర్ ఎగుమతిదారుల సూచిక ఫిబ్రవరి 2న ఒక్కరోజులోనే దాదాపు 6 శాతం పడిపోయింది. ఇది గత ఆరు సంవత్సరాలలోనే అత్యంత చెత్త ప్రదర్శనగా నమోదైంది. AI టెక్నాలజీపై ఉన్న భారీ అంచనాల మధ్య.. ఈ స్థాయిలో నష్టాలు రావడం పెట్టుబడిదారుల్లో ఆందోళనను మరింతగా పెంచింది. . కాకావో, నావర్, కారాట్ మార్కెట్ వంటి దక్షిణ కొరియాలోని అగ్ర టెAI రంగంలో వేగంగా అభివృద్ధి జరుగుతున్నప్పటికీ, అదే సమయంలో ప్రమాదాలపై హెచ్చరికలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్-సోర్స్ AI ఏజెంట్ల విషయంలో ప్రభుత్వాలు, పెద్ద కార్పొరేట్ సంస్థలు జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే ప్రసిద్ధ AI ఏజెంట్ OpenClaw(OpenClaw) పై చైనా, దక్షిణ కొరియా దేశాలు అప్రమత్తమయ్యాయి. క్ కంపెనీలు తమ కార్పొరేట్ నెట్వర్క్లలో ఓపెన్క్లా వినియోగాన్ని పరిమితం చేస్తున్నాయి. కంపెనీ డేటా భద్రతకు ఇది ముప్పుగా మారే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. కాకావో సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. సంస్థ సమాచార ఆస్తులను కాపాడేందుకు కార్పొరేట్ నెట్వర్క్లలో ఓపెన్క్లా వినియోగాన్ని పరిమితం చేసినట్లు వెల్లడించింది. నావర్ సంస్థ పూర్తిగా నిషేధం విధించగా.. కారాట్ ఓపెన్క్లాతో పాటు మోల్ట్బాట్ వంటి ఇతర AI ఏజెంట్లను కూడా బ్లాక్ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: