📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : online jihadi course : ఆన్‌లైన్‌లో జిహాదీ కోర్సులు..?

Author Icon By Sudha
Updated: October 22, 2025 • 1:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు మరో కొత్త కుట్రకు తెరలేపిన విషయం తెలిసిందే. కేవలం మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూప్‌ను తయారుచేస్తున్నది. మసూద్‌ అజార్‌ సోదరి సాదియా అజార్‌ నేతృత్వంలో ‘జమాతుల్‌-ముమినాత్‌’ పేరుతో ఓ ప్రత్యేక యూనిట్‌ను తయారుచేస్తున్నది. ఇందులో భాగంగానే మహిళలకు తాజాగా ఆన్‌లైన్‌ జిహాదీ కోర్సులను (online jihadi course) ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Read Also: Tariff: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలకు తొలి అడుగులు

online jihadi course

ఈ కోర్సుకు ‘తౌఫల్‌ అల్‌ ముమినత్‌’గా పేరు పెట్టినట్లు సమాచారం. మహిళలకు మతపరమైన, జిహాద్‌ ఆధారిత పాఠాలను (online jihadi course)బోధిస్తున్నట్లు తెలిసింది. రోజుకు 40 నిమిషాల పాటూ రోజువారీ సెషన్‌ ఉంటుందని.. మసూద్‌ అజార్‌ సోదరీమణులు సాదియా అజార్‌, సమైరా అజార్ ఆన్‌లైన్‌ ద్వారా మహిళలకు పాఠాలు బోధించనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ క్లాసెస్‌కు జాయిన్‌ అయ్యే ప్రతి మహిళా రూ.500 విరాళంగా అందించాల్సిందిగా.. మసూద్‌ సోదరీమణులు కోరినట్లు సమాచారం. కాగా, తీవ్రవాదుల భార్యలు, పేద మహిళలను రిక్రూట్‌ చేసుకోవడానికి జైషే మహమ్మద్‌ తొలుత ప్రాధాన్యం ఇస్తున్నది. బహావల్‌పూర్‌, కరాచీ, ముజఫరాబాద్‌, కోటిలీ, హరిపూర్‌ మదర్సాల్లోని మహిళలను ఉగ్రవాదం వైపు తీసుకొస్తున్నట్టు తెలిసింది.

జిహాద్ అంటే ఏమిటి?

జిహాద్ అనగా ఆశయ సాధన కోసం శక్తివంచన లేకుండా నిర్విరామంగా కృషి చేయడం, పోరాడటం. దీన్ని కొంతవరకూ స్ట్రగుల్ అనే ఆంగ్ల పదంతో పోల్చవచ్చు. ఇంకా విస్తృతంగా చెప్పాలంటే నిరంతరం ఆశయాన్నే దృష్టిలో పెట్టుకొని దాని కోసం పధకాలు రూపొందిచడం, వాక్కు, వ్రాతల ద్వారా ప్రచారం చేయడం, అందుబాటులో ఉండే వనరులన్నీ వినియోగించుకోవడం, అనివార్యమైతే ఆయుధం చేపట్టి పోరాడటం, అవసరమైతే ఆ మార్గంలో ప్రాణాలు సైతం ధారబోయడం – ఇవన్నీ జిహాద్ క్రిందికే వస్తాయి.

జిహాద్ చరిత్ర ఏమిటి?

తైమూర్ లంగ్, 14వ శతాబ్దానికి చెందిన టర్కో-మంగోల్ దండయాత్రలు చేపట్టిన వాడు. పశ్చిమ, మధ్యాసియా ప్రాంతాలను జయించాడు. ఇతను తనకు తాను “గాజీ” (పవిత్రయుద్ధం చేసేవాడు) అని ప్రకటించుకున్నాడు. కానీ ఇతను కేవలం తన రాజ్యకాంక్షను పూర్ణం చేసుకొనుటకు చెంగిజ్ ఖాన్ లా ఘోరమైన దండయాత్రలు చేపట్టాడు. ఇతను దండయాత్రలు చేపట్టిన రాజ్యాలు దాదాపు ముస్లింల రాజ్యాలే. అయిననూ ఇతను తన దండయాత్రలకు జిహాద్ అనే పేరు పెట్టుకుని ముస్లింలనే మట్టుబెట్టే మారణహోమం సృష్టించాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News cyber security extremist content jihad latest news online radicalization Telugu News Terrorism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.