బంగ్లాదేశ్లో కరెన్సీకి కొత్త చరిత్ర (A new history for the currency) ప్రారంభమైంది. జూన్ 1 నుంచి అక్కడ కొత్త డిజైన్తో రూపాంతరం చెందిన నోట్లు జారీ అవుతున్నాయి. ఈ సారి నోట్లపై ప్రముఖుల బదులు ప్రకృతి దృశ్యాలు, పుణ్యక్షేత్రాలు, చారిత్రక కట్టడాలు కనిపించనున్నాయి.ఇది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి. కొత్త సిరీస్ నోట్లలో రూ.1,000, రూ.50, రూ.20 అనే మూడు డినామినేషన్లు మొదటగా విడుదలయ్యాయి. వీటిని బంగ్లాదేశ్ (Bangladesh) సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి విడుదల చేసింది. తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకు బ్రాంచుల ద్వారా పంపిణీ జరుగుతుంది.
కొత్త నోట్ల ప్రత్యేకత ఏమిటి?
ఈ సారి నోట్లపై మానవులు కనిపించరన్నదే ప్రధాన విషయం. మునుపటి నోట్లపై బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఫోటోలు ఉండేవి. కానీ ఇప్పుడు హిందూ ఆలయాలు, బౌద్ధ విహారాలు, జైనుల్ అబేదీన్ కళా రచనలు, 1971లో జరిగిన విమోచన యుద్ధంలో అమరుల స్మారకాలను ఈ డిజైన్లలో చోటిచ్చారు.బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి ఆరిఫ్ హుసేన్ ఖాన్ మాట్లాడుతూ, “ఈ సారి కొత్త దృక్పథంతో ముందుకొచ్చాం. మనుషుల బదులు ప్రకృతి, సంస్కృతి, చరిత్రను నోట్లపై చూపుతున్నాం,” అన్నారు. ఇది ఒక విధంగా దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నంగా కూడా చెప్పొచ్చు.
ఇంతకు ముందు జరిగిన కరెన్సీ మార్పులు
ఇదే మొదటిసారి కాదు బంగ్లాదేశ్ కరెన్సీలో మార్పులు చోటుచేసుకున్నది. 1972లో పాకిస్తాన్ నుంచి విడిపోతూ, స్వతంత్ర దేశంగా ఏర్పడ్డప్పుడు తొలిసారి కరెన్సీ రూపాంతరం జరిగింది. అప్పట్లో నోట్లపై బంగ్లాదేశ్ మ్యాప్ ముద్రించారు.తరువాత షేక్ ముజిబుర్ రెహమాన్ ఫోటోలు వచ్చాయి. తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ పాలనలో చారిత్రక ప్రదేశాలు నోట్లపై దర్శనమిచ్చాయి. ఇప్పుడు మళ్లీ కొత్త కోణంలో ఆ చరిత్రను పునఃప్రారంభిస్తున్నారు.
ఇది కేవలం డిజైన్ మార్పేనా?
ఈ మార్పు కేవలం రూపాన్ని మార్చడమే కాదు. ఇది బంగ్లాదేశ్ తన భిన్నసంస్కృతిక విలువలను మళ్లీ వెలుగులోకి తేవాలన్న ఆలోచనకు నిదర్శనం. హిందూ, బౌద్ధ మతాలకు చెందిన ఆలయాలను చూపడం కూడా దేశంలోని మతసామరస్యానికి సంకేతంగా చెబుతున్నారు విశ్లేషకులు.
Read Also :Ukraine attack : రష్యాపై ఉక్రెయిన్ దాడి.. 40కి పైగా విమానాలు ధ్వంసం!