Ohio Jury Pregnancy Case: అమెరికాలోని ఒహాయోలో చోటుచేసుకున్న ఈ ఘటన కార్పొరేట్ సంస్థల పనితీరు, ఉద్యోగుల హక్కులపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మానవీయ కోణంలో ఆలోచించకుండా గర్భిణీ స్త్రీకి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ నిరాకరించినందుకు ఒక కంపెనీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒక ఉద్యోగిని పట్ల అమానుషంగా ప్రవర్తించిన కంపెనీకి అక్కడి జ్యూరీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. హై రిస్క్ ప్రెగ్నెన్సీతో బాధపడుతున్న మహిళా ఉద్యోగిని అభ్యర్థనను తోసిపుచ్చడమే కాకుండా, ఆమె బిడ్డ మరణానికి కారణమైనందుకు భారీ జరిమానా విధించింది.
Read Also: Iran-US War: సముద్రగర్భ కేబుల్స్పై ఇరాన్ దాడి? భారత్ సహా 9 దేశాలపై తీవ్ర ప్రభావం!
Ohio Jury Pregnancy Case: అసలేం జరిగింది?
బాధితురాలు గర్భంతో ఉన్న సమయంలో వైద్యులు ఆమెకు ‘హై రిస్క్’ అని తేల్చారు. ప్రయాణాలు చేయడం ప్రాణాపాయమని హెచ్చరిస్తూ, ఇంటి నుంచే పని (Work From Home) చేసేలా అనుమతించాలని కోరారు.సదరు కంపెనీ ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు. తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని ఒత్తిడి తెచ్చింది. ఉద్యోగం పోతుందనే భయంతో ఆమె ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చింది.

ఆఫీసు పనుల ఒత్తిడి, ప్రయాణం కారణంగా ఆమెకు నెలలు నిండకుండానే ప్రసవం జరిగింది. పుట్టిన కొద్ది గంటల్లోనే ఆ పసికందు కన్నుమూసింది.ఇందుకు కంపెనీనే కారణమని తేల్చిన జ్యూరీ ఆ కుటుంబానికి $22.5 మిలియన్లు(రూ.211.52 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. దీనిపై సంస్థ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: