లండన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, వృద్ధ నేతలపై తీవ్ర విమర్శలు(Severe criticism) చేశారు. అధికారం కోల్పోతామనే భయంతో వారు పదవులను పట్టుకుని ఉండటం వల్లే ప్రపంచంలో సగానికి పైగా సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పిరమిడ్లతో సహా ప్రతిదానిపై తమ పేరు ముద్రించాలని ఆశపడే అలవాటు, అనవసర సమస్యలకు దారితీస్తుందని పరోక్షంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
Read also: USA: అమెరికాలో కాల్పులు ..ముగ్గురి మృతి

అధికారం వదలని తత్వం
అధికారంతో పాటు మరేదీ వదలని వృద్ధ నేతలు సమస్యలకు కారణమవుతున్నారని ఒబామా అన్నారు. ఇది ప్రపంచ స్థిరత్వానికి పెద్ద అడ్డంకి అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల పారాసెటమాల్ వినియోగంపై డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఒబామా తప్పుబట్టారు. గర్భిణులు పారాసెటమాల్(Paracetamol) వాడితే శిశువులకు ఆటిజం వచ్చే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్న విషయాన్ని శాస్త్రీయ ఆధారంలేనిదిగా ఒబామా స్పష్టం చేశారు.
ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళాన్ని రేపుతాయని, ముఖ్యంగా ఆటిజంతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతాయని ఒబామా హెచ్చరించారు.
ఒబామా ఎక్కడ వ్యాఖ్యలు చేశారు?
లండన్లో జరిగిన ఒక కార్యక్రమంలో.
ఆయన ఎవరిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై.
Read hindi news: hindi.vaartha.com
Read Also: