2025 నోబెల్ శాంతి Nobel price పురస్కారంపై అమెరికాలో (America) తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమవుతోంది. ఈసారి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు ఈ బహుమతి దక్కగా, వైట్ హౌస్ (White House) దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం శాంతికి కంటే రాజకీయ పక్షపాతానికే ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైట్ హౌస్ ప్రతినిధి రాయిటర్స్కు మాట్లాడుతూ, “నోబెల్ కమిటీ ఇప్పుడు శాంతిని ప్రోత్సహించడం మానేసి రాజకీయ సంకేతాలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇది న్యాయం కాని నిర్ణయం” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో నోబెల్ (Nobel) ఎంపికల పారదర్శకతపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.
US : పాక్కు మిస్సైల్స్ సరఫరాను నిరాకరించిన అమెరికా

Nobel price
“వెనిజులాలో”
ఇక నోబెల్ Nobel price కమిటీ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించింది. “వెనిజులాలో (venezuela) ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మరియా మచాడో చేస్తున్న శాంతియుత పోరాటానికి ఇది గుర్తింపు” అని వారు స్పష్టం చేశారు. నియంతృత్వాన్ని ఎదుర్కొంటూ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఆమె చేసిన కృషి విశేషమని పేర్కొన్నారు.
ఈ పురస్కారంలో భాగంగా మరియా మచాడోకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ (దాదాపు 1.2 మిలియన్ డాలర్లు) నగదు బహుమతిగా ఇవ్వబడనుంది. అమెరికా నుంచి వచ్చిన విమర్శలతో ఈ నిర్ణయం అంతర్జాతీయ రాజకీయ వాతావరణంలో చర్చనీయాంశంగా మారింది. కొందరు దీన్ని ప్రజాస్వామ్యానికి గౌరవంగా చూస్తుండగా, మరికొందరు ట్రంప్కు నోబెల్ దక్కకపోవడమే అసలు ఆగ్రహానికి కారణమని వ్యాఖ్యానిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: