Nepal Bus Accident: నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని దేశవ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొంది. ధాడింగ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, అత్యవసర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: US Education Report: అమెరికాలో హిందువులు, యూదులు విద్యలో టాప్
ప్రాణ నష్టం కొంతమేర తగ్గింది
గాయపడిన వారిలో కొందరు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.ప్రమాదానికి దట్టమైన పొగమంచు లేదా డ్రైవర్ నిద్రమత్తు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో బస్సు పూర్తిగా మునిగిపోకుండా ఒడ్డున పడటం వల్ల ప్రాణ నష్టం కొంతమేర తగ్గిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com