📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Neeraj Chopra – నేడు వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా..మ్యాచ్ ఎక్కడ చూడాలంటే?

Author Icon By Anusha
Updated: September 17, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జపాన్ రాజధాని టోక్యో (Tokyo) క్రీడాభిమానులందరినీ మళ్లీ ఆకర్షిస్తోంది. 2025 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు మరోసారి తమ ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దేశం మొత్తం దృష్టి జావెలిన్ త్రో విభాగంపై కేంద్రీకృతమైంది. భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఈరోజు బరిలోకి దిగుతున్నాడు.

నీరజ్ చోప్రా పేరు ఇప్పుడు భారత క్రీడలలో ఒక స్ఫూర్తిదాయక చిహ్నంగా నిలిచింది. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో అతను గెలిచిన స్వర్ణపతకం దేశ క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. అదే వేదికపై ఈసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ (World Championship title) ను గెలుచుకోవడం, అతనికి మరో సవాలుగా మారింది. దేశం మొత్తం అతని మీద నమ్మకం ఉంచి, గెలుపు కోసం ఎదురుచూస్తున్నాడు..

గత కొంతకాలంగా కఠినమైన శిక్షణ తీసుకుని

జావెలిన్ త్రో ఈవెంట్‌లో ఈసారి భారత నుంచి కేవలం నీరజ్ చోప్రానే కాదు, సచిన్ యాదవ్, రోహిత్ యాదవ్, యశ్‌వీర్ సింగ్ వంటి ప్రతిభావంతులైన క్రీడాకారులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరంతా కూడా గత కొంతకాలంగా కఠినమైన శిక్షణ తీసుకుని, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని కృషి చేస్తున్నారు.నేడు జావెలిన్ త్రో (Javelin throw) క్వాలిఫికేషన్ రౌండ్ జరుగుతుంది. ఇందులో మొత్తం 37 మంది అథ్లెట్లు పాల్గొంటారు.

Neeraj Chopra

వారిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ‘ఏ’లో 19 మంది, గ్రూప్ ‘బీ’లో 18 మంది ఉన్నారు. గ్రూప్ ఏలో నీరజ్ చోప్రా, సచిన్ యాదవ్ ఉండగా.. గ్రూప్ బీలో రోహిత్ యాదవ్, యశ్‌వీర్ సింగ్ ఉన్నారు. క్వాలిఫికేషన్ రౌండ్‌ (Qualification round) లో 84.50 మీటర్లు త్రో చేసిన అథ్లెట్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ ఎవరూ ఈ మార్కును చేరుకోకపోతే, అత్యుత్తమ త్రో చేసిన 12 మంది ఫైనల్‌కు అర్హత పొందుతారు.

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

పాక్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ కూడా ఈ ఛాంపియన్ షిప్‌లో పోటీ పడుతున్నాడు. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో 92. 97 మీటర్ల త్రో చేసి ఒలింపిక్ రికార్డు (Olympic record) తో గోల్డ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఆయన ఇటీవల జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 86.40 మీటర్ల త్రోతో గోల్డ్ సాధించారు.నీరజ్ చోప్రా ఈవెంట్ (క్వాలిఫికేషన్ రౌండ్): గ్రూప్ ‘ఏ’ పోటీలు భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 17న మధ్యాహ్నం 3:40 గంటలకు మొదలవుతాయి.

గ్రూప్ ‘బి’ పోటీలు సాయంత్రం 5:15 గంటలకు ప్రారంభమవుతాయి. జావెలిన్ త్రో పురుషుల ఫైనల్ గురువారం (సెప్టెంబర్ 18) భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:53 గంటలకు జరుగుతుంది. ఈ ఈవెంట్‌ను భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/dhanashree-verma-what-does-dhanashree-verma-have-to-say-about-marriage/cinema/548698/

Breaking News gold medalist Indian javelin thrower latest news Neeraj Chopra Sachin Yadav Telugu News title defense tokyo Tokyo Olympics World Athletics Championship 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.