News Telugu: Muhammad: మా దేశంలో హిందువులపై హింస జరగడం అసత్యం..

Read Time:  1 min
Muhammad
Muhammad
FONT SIZE
GET APP

బంగ్లాదేశ్ Bangladesh ప్రధాన సలహాదారు మహమ్మద్ Muhammad యూనస్ తన దేశంలో హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింస వార్తలను తీవ్రంగా ఖండించారు. అవి వాస్తవం కాదని, భారత్ నుంచి ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చెందుతున్న “ఫేక్ న్యూస్” అని ఆయన ఆరోపించారు. అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్‌కు Muhammad Yunas ఇచ్చిన ఇంటర్వ్యూలో యూనస్ మాట్లాడుతూ – “భారత్‌లో ఫేక్ న్యూస్ ఒక పరిశ్రమలా మారిపోయింది. అక్కడి నుంచి వచ్చే తప్పుడు కథనాలు మా దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి” అని అన్నారు. దేశంలో చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనలు మతపరమైనవి కావని, అవి సాధారణంగా భూవివాదాలు లేదా స్థానిక తగాదాల ఫలితమని ఆయన స్పష్టం చేశారు.

China India : చైనా హెచ్చరిక అమెరికాకు ఎగుమతి చేస్తే భారత్‌కు Rare Earth

Muhammad

Muhammad

అయితే, యూనస్ Muhammad చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగాయని అంతర్జాతీయ సంస్థలు నివేదించిన సంగతి తెలిసిందే. దీనిపై యూనస్ “ట్రంప్ Trump లేదా ఇతర విదేశీ నేతలకు బంగ్లాదేశ్ వాస్తవ పరిస్థితులపై పూర్తి అవగాహన లేదని” అన్నారు. అంతేకాకుండా, హిందూ సమాజాన్ని ఉద్దేశించి ఆయన “మిమ్మల్ని మీరు ఈ దేశ పౌరులుగా భావించండి, కేవలం హిందువులుగా కాకుండా” అంటూ పిలుపునిచ్చారు. మరోవైపు, గతంలో ఢాకాలో వేలాది హిందువులు రక్షణ కోసం నిర్వహించిన నిరసనలు యూనస్ వ్యాఖ్యలతో విరుద్ధంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఏ అంశంపై వ్యాఖ్యానించారు?
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింస వార్తలు తప్పుడు అని, అవి భారత్ నుంచి వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్ అని మహమ్మద్ యూనస్ అన్నారు.

మహమ్మద్ యూనస్ ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేశారు?
అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.