📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India-pak : గ్లోబల్ స్థాయిలో మోడీ కొత్త వ్యూహం..

Author Icon By Shobha Rani
Updated: May 17, 2025 • 1:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) ను విజయవంతంగా ముగించిన భారత్ ఇప్పుడు దీర్ఘకాలిక వ్యూహాలపై ఫోకస్ పెంచుతోంది. ముఖ్యంగా ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల్ని ఏకం చేసేందుకు అడుగులు వేస్తోంది. పాకిస్తాన్ పై స్వల్పకాలిక యుద్ధం తాము చేయడం కంటే ప్రపంచ దేశాల నుంచి ఉగ్రవాదానికి మద్దతిస్తున్న ఆ దేశంపై ఒత్తిడి పెంచేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ (Modi)కొత్త ఆపరేషన్ ప్రారంభిస్తున్నారు. ఉగ్రవాదాన్ని అంతరించేందుకు భారత్ గ్లోబల్ లెవెల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నం ప్రారంభించింది. ఈ కొత్త ఆపరేషన్ ద్వారా కూటమిల రాజకీయాన్ని వినియోగించు కుంటూ, పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిగా నిలబెట్టేందుకు కృషి చేస్తోంది. ఆయా బృందాలు భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను వివరిస్తాయి. పాకిస్థాన్‌పై ఉన్న అంతర్జాతీయ మద్దతును తగ్గించాలన్నది ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం.


అడుగులు వేస్తోంది.

అఖిలపక్ష ప్రతినిధి బృందాల ఏర్పాటు
ఐక్యరాజ్యసమితితో పాటు భారత్ కు కీలక మిత్రదేశాల్లో పర్యటించి ఉగ్రవాద వ్యతిరేక సందేశం వినిపించేందుకు వీలుగా ప్రధాని మోడీ (Modi) ఏడుగురు ఎంపీల నేతృత్వంలో వేర్వేరు అఖిలపక్ష బృందాల్ని ఏర్పాటు చేశారు. ఏడుగురు ఎంపీల నేతృత్వంలోని అఖిలపక్ష బృందాలు త్వరలో ఐక్యరాజ్యసమితితో పాటు భారత్ కు కీలక మిత్రదేశాల్లో పర్యటిస్తాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. శశిథరూర్‌ నేతృత్వంలో అఖిల పక్ష బృందం అమెరికాకు వెళ్లనుంది. తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్‌ పాండా బృందం, రష్యాకు కనిమొళి నేతృత్వంలోని బృందం, ఆగ్నేయాసియాకు సంజయ్‌ ఝా బృందం, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు రవిశంకర్‌ ప్రసాద్‌ బృందం, పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం, ఆఫ్రికన్‌ దేశాలకు శ్రీకాంత్‌ షిండే బృందం వెళ్లేలా కేంద్రం షెడ్యూల్ చేసింది. ఆయా దేశాల్లో వీరు రెండు రోజుల పాటు పర్యటించే అవకాశం ఉంది.

Read Also: Turkey : కుప్పకూలిన టర్కీ ఆర్థిక వ్యవస్థ.. అదానీ ఒప్పందం రద్దు

#telugu News at the global level.. Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Modi's new strategy Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.