Donald Trump : ట్రంప్ వ్యాఖ్యలను మోదీ ఖండించడం లేదు – రాహుల్

Read Time:  1 min
Donald Trump : ట్రంప్ వ్యాఖ్యలను మోదీ ఖండించడం లేదు – రాహుల్
FONT SIZE
GET APP

భారత్-పాక్ సీజ్ ఫైర్ కి తానే కారణమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్యాఖ్యలు దేశంలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. “ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్గత రాజకీయాలకు సంబంధించి, భారత సార్వభౌమాధికారాన్ని నెగెటివ్‌గా చూపించేవి” అని రాహుల్ విమర్శించారు.

ప్రధాని మౌనం పట్ల తీవ్ర విమర్శ

ట్రంప్ వ్యాఖ్యలు తక్కువగా తీసుకునేలా లేవని, ప్రధానమంత్రి మోదీ ఎందుకు స్పందించలేదని రాహుల్ (Rahul) ప్రశ్నించారు. “భారత ప్రజల నైతికత, దేశ గౌరవం విషయంలో మోదీకి బాధ్యత ఉంది. కానీ ఆయన మౌనం అనుమానాలకు తావిస్తోంది. ఆయన స్పందించకపోతే, ట్రంప్ చేసిన ఆరోపణలు నిజమేనని ప్రజలు అనుకునే అవకాశం ఉంది” అని రాహుల్ అన్నారు. మోదీ తన వ్యక్తిగత విదేశీ సంబంధాలను దేశ ప్రయోజనాల కంటే ప్రాధాన్యతగా తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

వాణిజ్య ఒప్పందాల వెనుక ఉన్న రాజకీయాలు

అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం మోదీ ప్రభుత్వం మౌనంగా ఉంటోందని రాహుల్ ఆరోపించారు. “ట్రంప్ భారత్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ట్రేడ్ డీల్ కోసం ఏవైనా అంగీకారాలు ఉన్నాయా? దేశ ప్రయోజనాల కంటే విదేశీ ఒప్పందాలు ముఖ్యమా?” అంటూ ఆయన ప్రశ్నించారు. ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా భారత దేశానికి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని, ప్రధాని మోదీ వెంటనే స్పందించి దేశ గౌరవాన్ని నిలబెట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు.

Read Also : Nandini Kashyap: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో పోలీసుల అదుపులో నటి నందిని

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.