📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

షాంఘై సదస్సు..ఇస్లామాబాద్ చేరుకున్న మంత్రి జైశంకర్..పాక్‌ కీలక వ్యాఖ్యలు

Author Icon By sumalatha chinthakayala
Updated: October 16, 2024 • 5:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ నిన్ననే (మంగళవారం) ఇస్లామాబాద్ చేరుకున్నారు. భారత ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన వెళ్లారు. అయితే జైశంకర్ తమ దేశంలో అడుగుపెట్టిన కొన్ని గంటల తర్వాత పాకిస్థాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. షాంఘై సదస్సుతో పాటు పాకిస్థాన్‌తో విడిగా ద్వైపాక్షిక చర్చలు జరపాలా? లేదా? అనేది నిర్ణయించుకోవాల్సింది భారతదేశమేనని ఆ దేశ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. షాంఘై సదస్సు కోసం తమ దేశానికి వచ్చిన అతిథులు ఏమి కోరుకున్నా దాని ప్రకారం నడచుకుంటామని ఆయన అన్నారు.

‘‘ ద్వైపాక్షిక చర్చలకు మేము ప్రతిపాదన చేయలేం. అతిథుల నిర్ణయం ప్రకారమే మేము నడచుకుంటాం. అతిథులు ద్వైపాక్షిక సమావేశం కావాలనుకుంటే మేము చాలా ఆనందిస్తాం. ఆతిథ్యం ఇస్తున్న దేశంగా ద్వైపాక్షిక చర్చల విషయంలో మేము ఎవరినీ ప్రభావితం చేయలేం’’ అని అహ్సాన్ ఇక్బాల్ స్పష్టం చేశారు. భారత్-పాకిస్థాన్ విదేశాంగ మంత్రుల మధ్య ద్వైపాక్షిక సమావేశాన్ని ప్రతిపాదించాలనుకుంటున్నారా? అని మీడియా ప్రశ్నించగా ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

ఇక భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని పాకిస్థాన్ కోరుకుంటుందా? అని ప్రశ్నించగా… ‘లాహోర్ డిక్లరేషన్’ స్ఫూర్తితో ఇరు దేశాలు నడచుకోవాలని అహ్సాన్ వ్యాఖ్యానించారు. లాహోర్ డిక్లరేషన్‌ను స్ఫూర్తిగా తీసుకుంటే ఇరు దేశాలు కలిసి పరిష్కరించలేని సమస్య ఏమీ ఉండబోదని తాను భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. కాగా, షాంఘై సదస్సులో భాగంగా భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సమావేశాన్ని ఇరుదేశాలు ఇప్పటికే తోసిపుచ్చాయి.

india Minister Jaishankar Pakistan SCO Summit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.