అమెరికా–భారత్ మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో, ప్రముఖ అమెరికన్ గాయని మరియు నటి Mary Millben భారత ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యనీతిపై ప్రశంసలు కురిపించారు. భారత్ పట్ల అమెరికా ప్రభుత్వం ఇటీవల అవలంబిస్తున్న వైఖరిని తీవ్రంగా విమర్శించిన ఆమె, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు Donald Trump తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒత్తిడిలోనూ ప్రధాని మోదీ ప్రదర్శిస్తున్న సంయమనం, (Mary Millben) హుందాతనం ప్రపంచ వేదికపై ఆయనను గౌరవనీయమైన నాయకుడిగా నిలబెట్టిందని మిల్బెన్ పేర్కొన్నారు. అమెరికా నుంచి ప్రతికూల సంకేతాలు వచ్చినప్పటికీ, యూరోపియన్ యూనియన్, చైనా, రష్యా వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తూ భారత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగిందని ఆమె అన్నారు. భారత్–ఈయూ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
Read Also: Vishwak Sen: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల
ట్రంప్ను ఉద్దేశిస్తూ, “ఇదే సరైన సమయం. ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పి, భారత్తో సంబంధాలను పునరుద్ధరించుకోవాలి. ఇది బలహీనత కాదు, బలానికి సంకేతం” అని మిల్బెన్ సూచించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: