కెనడా రాజకీయాల్లో కీలక మలుపు తీసుకువచ్చే పరిణామాలు చోటుచేసుకున్నాయి. పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేసిన తర్వాత, లిబరల్ పార్టీకి కొత్త నాయకత్వంగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టారు. ట్రూడో పరిపాలనపై పార్టీ అంతర్గతంగా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తడంతో ఈ మార్పు సంభవించింది. అయితే ఈ నాయకత్వ మార్పుతో లిబరల్ పార్టీకి తిరిగి ప్రజాభారం పెరిగినట్లు తాజాగా వెలువడిన ఓపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి.మార్క్ కార్నీ నాయకత్వంలో లిబరల్ పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇటీవల నానోస్ పోల్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, లిబరల్స్కు 43.7 శాతం ప్రజాసమ్మతి లభించగా, ప్రధాన ప్రత్యర్థి కన్జర్వేటివ్ పార్టీకి 36.3 శాతం మద్దతు మాత్రమే లభించింది. ఓటింగ్ రోజైన ఏప్రిల్ 28వ తేదీ వరకు ఈ గణాంకాలు ఇలా కొనసాగితే, కెనడియన్ పార్లమెంట్లో లిబరల్స్ మెజారిటీ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.కెనడా-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో ఏర్పడుతున్న ఉద్రిక్తతలు, ట్రంప్ పెట్టిన సుంకాలు, వలసల పైన నిర్దిష్ట విధానాలపై లిబరల్ పార్టీ దృష్టి పెట్టింది. అమెరికా ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు. అమెరికా హెచ్చరికలతో కెనడా ఎన్నికలు అంతర్జాతీయంగా సైతం ప్రాధాన్యత సాధించాయి.

నాయకత్వ మార్పుతో లిబరల్ పార్టీకి కొత్త ఊపు
ఇక ఒట్టావా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న కార్నీ, తన అభివృద్ధి దృక్పథంతో దేశ ప్రజలకు ఆకర్షణగా మారారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వలసల నియంత్రణ వంటి ప్రధాన అంశాల్లో ఫెయిలైన సందర్భాలను ఎత్తిచూపుతూ, తన నాయకత్వంలో బలమైన ప్రభుత్వం అవసరమని ప్రజలకు చెబుతున్నారు. తాజా సర్వేలు కూడా అదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.కానీ ఈ ప్రజాభారం ఓటింగ్ వరకు కొనసాగాలంటే, లిబరల్స్ తమ ప్రచార వ్యూహాలను మరింత ముదుర్చాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. లిబరల్ పార్టీ తిరిగి అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నప్పటికీ, పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా వెళ్తుందో చూడాల్సిన విషయం.
Read More : kaleshwaram: రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ మలిదశ విచారణ