పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో జిహాదీ ఉగ్రవాదులు దారుణమైన చర్యకు పాల్పడ్డారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్టాక్లో(TikTok) వీడియోలు పోస్ట్ చేస్తూ పాప్యులర్ అయిన ఒక యువతిని కిడ్నాప్ చేసి, బహిరంగంగా కాల్చి చంపారు. ఆమె సైన్యానికి గూఢచారిగా పనిచేస్తోందన్న ఆరోపణలతో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.
Read also: Sunita Ahuja: బాబోయ్.. మరో జన్మ ఉంటే భర్తగా గోవిందా వద్దు
యువతికి 90 వేల మంది ఫాలోవర్లు
ఉత్తర మాలిలోని టింబక్టు ప్రాంతంలోని టోంకా నగరానికి చెందిన మరియమ్ సిస్సే(Mariam Cisse) అనే యువతి టిక్టాక్లో స్థానిక విశేషాలపై వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు సుమారు 90 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, గురువారం కొందరు జిహాదీలు ఆమెను అపహరించారు. మాలి సైన్యంకు తమ కదలికల గురించి ఆమె సమాచారం చేరవేస్తోందని వారు ఆరోపించారు. ఆ మరుసటి రోజు శుక్రవారం, మరియమ్ను ఒక మోటార్బైక్పై టోంకా నగరంలోని ఇండిపెండెన్స్ స్క్వేర్కు తీసుకొచ్చారు. అక్కడి జనసమూహం చూస్తుండగానే ఆమెను తుపాకీతో కాల్చి చంపారు. “వారు నా సోదరిని చంపేటప్పుడు నేను ఆ గుంపులోనే ఉన్నాను” అని ఆమె సోదరుడు ఆవేదనతో వెల్లడించారు.
భద్రతా పరిస్థితులు, ఉగ్రవాద కార్యకలాపాలు
ఈ ఘటనను ఒక భద్రతా అధికారి ధ్రువీకరిస్తూ, “మాలి సైన్యం కోసం జిహాదీలను వీడియో తీస్తోందని ఆరోపిస్తూ మరియమ్ సిస్సేను బహిరంగంగా హత్య చేశారు. ఇది అత్యంత అనాగరికమైన చర్య” అని పేర్కొన్నారు. 2012 నుంచి మాలి దేశం జిహాదీ ఉగ్రవాదంతో పోరాడుతోంది. ఇటీవలే అల్-ఖైదాతో సంబంధాలున్న జేఎన్ఐఎం అనే ఉగ్రవాద సంస్థ దేశంలో ఇంధన దిగ్బంధనం విధించింది. దీనివల్ల పలు ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడటంతో పాటు పంటల కోతలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఈ దారుణ హత్య దేశంలోని భద్రతా పరిస్థితులకు అద్దం పడుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: