Manipur violence : మణిపూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉఖ్రుల్ జిల్లాలోని లిటన్ ప్రాంతంలో ఆందోళనకారులు రెండు ఇళ్లను తగలబెట్టడంతో ఉదయం నుంచే ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఉదయం సమయంలో తుపాకీ శబ్దాలు వినిపించాయని పోలీసులు తెలిపారు. అయితే ఎవరూ గాయపడినట్లు లేదా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. స్థానికంగా రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య మద్యం మత్తులో జరిగిన గొడవ ఈ హింసకు కారణమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Read Also: ICC: ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్ చక్రవర్తి
ఇటీవలే నాగ, కుకీ వర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో ఆదివారం రాత్రి దాదాపు 40 ఇళ్లకు నిప్పంటించిన ఘటన చోటుచేసుకుంది. తాజాగా గురువారం మరో రెండు ఇళ్లను తగలబెట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు కర్ఫ్యూ విధించగా, లిటన్ ప్రాంతంతో పాటు జిల్లాలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు చురాచంద్పూర్ జిల్లాలో కుకీ మహిళలు నిరసనలు చేపట్టగా, ఇతర ప్రాంతాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం అదనపు భద్రతా బలగాలను మోహరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: