Latest News: Virat Kohli – కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై తాలిబాన్ నేత అనస్ హక్కానీ ఏమన్నారంటే?

Read Time:  1 min
Virat Kohli
Virat Kohli
FONT SIZE
GET APP

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ కీలక నాయకుల్లో ఒకరైన అనస్ హక్కానీ (Anas Hakkani) తాజాగా భారత క్రికెట్‌పై చేసిన వ్యాఖ్యలు క్రీడాభిమానుల్లో ఆసక్తికర చర్చలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ (Test cricket) నుంచి రిటైర్మెంట్ తీసుకోవడంపై ఆయన ఇచ్చిన స్పందన ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. హక్కానీ క్రికెట్‌ను దగ్గరగా అనుసరిస్తానని చెబుతూ, కోహ్లీ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని స్పష్టంగా చెప్పాడు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హక్కానీ, “రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకోవడం సహజమే. వయసు, శారీరకంగా వచ్చే ఒత్తిడి కారణంగా ఆ నిర్ణయం అర్థమయ్యేలా ఉంది. కానీ కోహ్లీ (Virat Kohli) లాంటి ఆటగాడు రిటైర్ అవ్వడం మాత్రం అప్రత్యాశితం. అతను ఇంకా కనీసం కొన్నేళ్లు ఆడగలడని నాకు అనిపిస్తోంది” అని అన్నారు. అంతేకాక, కోహ్లీని ప్రపంచ క్రికెట్‌ (World Cricket) లో అత్యంత అరుదైన ప్రతిభ కలిగిన ఆటగాడిగా అభివర్ణించాడు. “అతని బ్యాటింగ్ స్టైల్, ఫిట్‌నెస్, మైదానంలో చూపించే ప్యాషన్ ప్రత్యేకం.

భారత మీడియా సృష్టించిన ఒత్తిడి కారణంగానే

అతనిలాంటి ఆటగాళ్లు తరచుగా రారు. కోహ్లీ 50 ఏళ్ల వయసు వరకూ ఆడాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను” అని వ్యాఖ్యానించాడు.హక్కానీ వ్యాఖ్యలు క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. సాధారణంగా తాలిబన్ (Taliban) నాయకులు రాజకీయాలు, మతపరమైన విషయాలపై మాత్రమే మాట్లాడతారు. కానీ ఆయన అంతర్జాతీయ క్రికెట్, భారత ఆటగాళ్లపై ఇంత లోతుగా స్పందించడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. కోహ్లీపై ఆయన చూపిన అభిమానాన్ని గమనిస్తే, క్రీడలు దేశ సరిహద్దులను దాటి మనసులను కలుపుతాయని స్పష్టమవుతోంది.

Virat Kohli
Virat Kohli

భారత మీడియా (Indian media) సృష్టించిన ఒత్తిడి కారణంగానే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని హక్కానీ అభిప్రాయపడ్డారు. “బహుశా భారత మీడియా వల్ల అతను విసిగిపోయి ఉంటాడు. అతనికి ఇంకా ఆడేందుకు సమయం ఉంది. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) టెస్ట్ పరుగుల రికార్డును జో రూట్ ఎలా ఛేదించే ప్రయత్నంలో ఉన్నాడో చూడండి” అని ఆయన పేర్కొన్నారు.

టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే

ఈ ఏడాది మే నెలలో భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli, Rohit Sharma) టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. మే 7న రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటించగా, సరిగ్గా ఐదు రోజుల తర్వాత మే 12న 36 ఏళ్ల కోహ్లీ కూడా టెస్టుల నుంచి తప్పుకున్నాడు. టెస్టుల్లో 10,000 పరుగుల మైలురాయికి కేవలం 770 పరుగుల దూరంలో కోహ్లీ నిలిచిపోయాడు.వారి రిటైర్మెంట్ తర్వాత, 25 ఏళ్ల యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

గిల్ నాయకత్వంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు, టెస్ట్ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుని ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో భాగంగా జరిగే మూడు వన్డేల సిరీస్‌లో వీరు తిరిగి బరిలోకి దిగనున్నారు. కాగా, ప్రస్తుతం భారత జట్టు ఆసియా కప్ 2025లో ఆడుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ban-vs-sl-sri-lanka-win-the-match-against-bangladesh/international/546907/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.