అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల (రెసిప్రొకల్ టారిఫ్లు) విషయంలో భారత వ్యాపారాలకు ఊరట కలిగించే సంచలన తీర్పు ఫెడరల్ కోర్టు నుండి వెలువడింది. వాషింగ్టన్లోని ఫెడరల్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఈ కేసును విచారించి 7-4 మెజారిటీతో నిర్ణయం తీసుకుంది. కోర్టు తీర్పులో ట్రంప్ విధించిన పలు కీలక సుంకాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.కోర్టు తేల్చినట్లే, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం కలిగిస్తున్న ఈ సుంకాలను విధించడానికి అధ్యక్షుని విస్తృత అధికారాలు లేవని స్పష్టంగా పేర్కొంది. రాజ్యాంగ ప్రకారం, సుంకాలు విధించే అధికారం కేవలం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉంది. ట్రంప్ ఈ అధికారం అతిక్రమించారని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఈ సుంకాలను ఆర్థిక అత్యవసర పరిస్థితిగా చూపుతూ, అంతర్జాతీయ ఆర్థిక అత్యవసర అధికారాల చట్టం (IEEPA) కింద అమలు చేశారు.
టారిఫ్లు చట్టవిరుద్ధమని కోర్టు ప్రకటించడంతో
అయితే, ఆ చట్టంలో సుంకాలు విధించే అధికారాన్ని స్పష్టంగా ఎక్కడా పేర్కొనబడలేదని కోర్టు తీర్పులో పేర్కొంది.ఈ తీర్పు భారత్ వంటి వాణిజ్య భాగస్వాములకు గట్టి ఊరటగా మారింది. గతంలో అమెరికా విధించిన ఈ సుంకాల వల్ల భారత ఎక్స్పోర్ట్ వ్యాపారాలు (Indian export businesses), స్టీల్, ఆల్యూమినియం, IT ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తుల పై ప్రభావం పడిన విషయం తెలిసిందే. ట్రంప్ విధించిన టారిఫ్లు చట్టవిరుద్ధమని కోర్టు ప్రకటించడంతో, భారత్ వ్యాపారాలు భవిష్యత్తులో,అమెరికా మార్కెట్లో వ్యాపారం కొనసాగించగలవు.ఈ తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత పక్షపాతంతో కూడుకున్న నిర్ణయమని, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. “ఈ తీర్పు ఇలాగే కొనసాగితే, అది అమెరికాను నాశనం చేస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

అక్టోబర్ 14 వరకు కోర్టు నిలిపివేసింది
వైట్హౌస్ కూడా ఈ తీర్పుపై స్పందిస్తూ, సుప్రీంకోర్టులో తమకు అంతిమ విజయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.అయితే, ట్రంప్ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పు అమలును అక్టోబర్ 14 వరకు కోర్టు నిలిపివేసింది. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న టారిఫ్లు యథావిధిగా అమల్లో ఉంటాయి. ఈ తీర్పు సుప్రీంకోర్టులో కూడా నిలబడితే, భారత్పై విధించిన 25 శాతం ప్రతిస్పందన సుంకం రద్దవుతుంది. కాగా, జాతీయ భద్రతా కారణాలతో స్టీల్, అల్యూమినియం, రాగి వంటి ఉత్పత్తులపై విధించిన సుంకాలకు ఈ తీర్పు వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలుపై విధించిన 25 శాతం సుంకం విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: