బ్యాడ్మింటన్ ప్రపంచంలో తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) మరోసారి తన ప్రతిభను నిరూపించింది. గత కొన్ని నెలలుగా ఫామ్లో లేనన్న విమర్శలను పక్కనబెట్టి, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో అద్భుత ప్రదర్శన కనబరిచి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో సింధు 21-19, 21-15 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్, చైనీస్ స్టార్ షట్లర్ వాంగ్ జి యిపై ఘనవిజయం సాధించింది.48 నిమిషాల పాటు సాగిన ఈ ఉత్కంఠభరిత పోరులో సింధు తన పటిమ, అనుభవం, ధైర్యసాహసాలతో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్లో వాంగ్ గట్టి పోటీ ఇచ్చినా, సింధు తన శక్తివంతమైన స్మాష్లు, ఖచ్చితమైన నెట్ షాట్లతో ఆధిపత్యం సాధించింది. చివరి దశలో ఆత్మవిశ్వాసంతో ఆడిన సింధు గేమ్ పాయింట్ (Game point) ను తన ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్లో ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన సింధు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి, వరుస పాయింట్లు సాధించి గెలుపు ఖాయం చేసింది.
సింధు మళ్లీ తన ఫామ్లోకి వచ్చిందని
ఈ విజయంతో సింధు వాంగ్పై తన ముఖాముఖి రికార్డ్ను 3-2తో మెరుగుపరచుకుంది. అంటే ఐదు సార్లు తలపడిన ఈ ఇద్దరిలో సింధు మూడు సార్లు పైచేయి సాధించింది. ప్రపంచ రెండో ర్యాంకర్ను ఓడించడం ద్వారా సింధు మళ్లీ తన ఫామ్లోకి వచ్చిందని అభిమానులు భావిస్తున్నారు.శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు ప్రారంభమయ్యే క్వార్టర్ ఫైనల్లో (quarter-finals) ఇండోనేషియా ప్లేయర్ పుత్రి కుసుమవర్ధనితో సింధు తలపడనుంది. 38వ ర్యాంకర్ అయిన పుత్రి కుసమవర్దనితో 12వ ర్యాంకర్ పీవీ సింధు ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడి గెలిచింది. గతేడాది జరిగిన ఉబెర్ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో సింధు 21-15, 21-17 తేడాతో పుత్రి కుసుమ వర్ధానిపై విజయం సాధించింది. ఈ రికార్డ్ ప్రకారం సింధు సునాయసంగా సెమీఫైనల్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
క్వార్టర్ ఫైనల్కు సాత్విక్-చిరాగ్ జోడీ
బీడ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో సింధుకు మెరుగైన రికార్డ్ ఉంది. 2019లో స్వర్ణ పతకం సాధించిన సింధు.. 2017, 2018 టోర్నీలో రజత పతకాలు అందుకుంది. 2013, 2014లో క్యాంస్య పతకాలు సాధించింది. ఈ సారి తిరిగి స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉంది.పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్ 19-21, 21-15,21-17 తేడాతో చైనాకు చెందిన లియాంగ్, వాంగ్ జోడీని మట్టికరిపించింది. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ ప్రపంచ ఐదో ర్యాంక్ జంటకు షాకిచ్చింది. మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ పిల-తనీషా క్రాస్టో జోడీ ప్రపంచ ఐదో ర్యాంక్ జంటకు షాకిచ్చింది.ప్రిక్వార్టర్స్లో భారత ద్వయం ధ్రువ్-పిల 19-21, 21-12, 21-15తో టాంగ్ చున్-యింగ్ సూట్(హాంకాంగ్) జంటపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్ 8-21, 21-17, 21-23తో ఆండర్స్ ఆంథోన్సెన్(డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశాడు.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: