అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా విచిత్రంగానే ఉంటుంది. ఆమధ్య తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, ఆరు యుద్ధాలను ఆపానని,పదేపదే చెప్పుకున్న ట్రంప్ తాజాగా తన మనసులోని మరో కోరికను వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలో నిలిచిపోయిన నలుగురు గొప్ప ఆధ్యక్షుల,ముఖచిత్రాలతో ఉన్న మౌంట్ రష్మోర్ (Mount Rushmore) పై తన ముఖాన్ని కూడా చూడాలని ఉన్నట్లు కోరారు. ఈ మేరకు ఆ అధ్యక్షుల ముఖాల పక్కనే తన ముఖం ఉన్నట్లుగా రూపొందించిన ఒక ఏఐ వీడియోను ట్రంప్ తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు.
జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆ నలుగురు
దక్షణ డకోటాలోని బ్లాక్ హిల్స్ లో ఉన్న మౌంట్ రష్మోర్ ఒక జాతీయ స్మారక చిహ్నం. ఇక్కడి భారీ గ్రానైట్ పర్వతంపై అమెరికా జాతి నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన మాజీ అధ్యక్షులు జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, థియోడర్ రూజ్వెల్డ్. అబ్రహం లింకన్ (Abraham Lincoln) ల 60 అడుగుల ముఖశిల్పాలు చెక్కారు.ఏటా లక్షలాది మంది పర్యాటకులు దీనిని దర్శిస్తుంటారు. ఈ దిగ్గజాల సడిసన తన శిల్పం కూడా ఉండాలనేది ట్రంప్ కోరిక. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ సభ్యురాలు అన్నా పౌలినా లూనా.. ట్రంప్ ముఖాన్ని అక్కడ చేర్చాలంటూ ప్రతిపాదన కూడా తీసుకువచ్చారు.
ఆచరణ సాధ్యం కాదు: నిపుణులు
ట్రంప్ ఆశలకు అధికారులు, నిపుణులు బ్రేకులు వేస్తున్నారు. ఆ పర్వతంపై ఐదో ముఖాన్ని చెక్కడం ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. మౌంట్రష్మోర్ నిర్వహణ చూసే నేషనల్ పార్క్ సర్వీస్ కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఉన్న శిల్పాల కారణంగా పర్వతంపై మరిన్ని చెక్కడాలుప్రమాదకరమని అధికారులు అంటున్నారు. గతంలోనూ జాన్ ఎఫ్.కెన్నడీ, రోనాల్డ్ రీగన్, బరాక్ ఒబామా
వంటి అధ్యక్షుల ముఖాలు కూడా మౌంట్రష్మోర్పై చేర్చేందుకు ప్రస్తావనకు వచ్చినా, అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ట్రంప్ విషయంలో కూడా సాంకేతిక కారణాల వల్ల ఆయన కోరికనెరవేరడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి విషయంలో తనదే పైచేయిగా ఉండాలని ట్రంప్ ప్రయత్నిస్తుంటారు. నోబెల్ బహుమతికితాను అర్హుడని పలు మార్లు దానిపై ఉన్న తన కోరికను వ్యక్తం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Read also: