📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Abu Saiullah : లష్కరే తోయిబా ఉగ్రవాది అబు సైఫుల్లా హతం

Author Icon By Shobha Rani
Updated: May 19, 2025 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లష్కరే తోయిబా ఉగ్రవాది రజౌల్లా నిజామాని అలియాస్​ అబు సైఫుల్లా(Abu Saiullah) ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్థాన్​, సింధ్ ప్రావిన్స్​లో ఉంటున్న అబు సైఫుల్లా (Abu Saiullah) ఆదివారం మధ్యాహ్నం మట్లీలోని తన నివాసం నుంచి బయలుదేరి, ఒక క్రాసింగ్​కు సమీపంలోకి వచ్చినప్పుడు గుర్తు తెలియని సాయుధులు అతడిని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. పాక్ ప్రభుత్వ భద్రత ఉన్నప్పటికీ ఆ ఉగ్రవాదిని నడిరోడ్డుపై కాల్చి చంపడం గమనార్హం.అబు సైఫుల్లా (Abu Saiullah) పాక్ భద్రతా యంత్రాంగ పర్యవేక్షణలో ఉండగా కూడా, నడిరోడ్డుపై బహిరంగంగా హత్య జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది పాక్ భద్రతా వైఫల్యాన్ని సూచిస్తోందా? లేక ఉగ్రవాద వర్గాల అంతర్గత గొడవల ఫలితమా? పాక్‌లోని ప్రత్యర్థి ఉగ్రవాద గుంపుల మధ్య ఘర్షణల ఫలితంగా హత్య జరిగిందా? లేదా భారత గూఢచారి సంస్థల ప్రతీకార చర్యగా జరిగిందా? లేదా పాక్ యంత్రాంగానికి అప్రయోజకుడిగా మారినందుకే అంతం చేశారా? అనే ప్రశ్నలు మిగిలాయి.

Abu Saiullah : లష్కరే తోయిబా ఉగ్రవాది అబు సైఫుల్లా హతం

భారత్‌లో జరిపిన ఉగ్రదాడుల్లో పాత్ర
అబు సైఫుల్లా భారత్​లో జరిగిన అనేక ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు. నాగ్​పూర్​లోని రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​) ప్రధాన కార్యాలయంపై 2006లో జరిగిన దాడి వెనుక ఉన్నది ఇతనే. అంతేకాదు 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సైన్స్​పై జరిగిన ఉగ్రదాడి, 2001లో రాంపూర్​లోని సీఆర్​పీఎఫ్​ శిబిరంపై జరిగిన ఉగ్రదాడి వెనుకున్న సూత్రధారి కూడా ఈ ముష్కరుడే. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది అబు సైఫుల్లా (Abu Saiullah) హత్య పాక్ భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు రేపుతుంది. అతను భారత్‌లో నిర్వహించిన అనేక దాడులకు కీలకమైన గూఢాచారి, పథకకర్తగా ఉన్న నేపథ్యంలో, ఈ హత్య అంతర్జాతీయ భద్రతాపరంగా ప్రాధాన్యత పొందింది. ఈ ఘటన తర్వాత భారత్, పాక్ మధ్య ఉగ్రవాదంపై ఉన్న ఆరోపణలు, గూఢచారి యుద్ధాల చర్చలు మరింత ఉధృతమయ్యే అవకాశముంది.

Read Also: Putin: అణ్వాయుధాలు లేకుండానే ఉక్రెయిన్‌పై విజయానికి రెడీ: పుతిన్

Abu Saifullah killed Breaking News in Telugu Google news Google News in Telugu Lashkar-e-Toiba terrorist Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.