📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Iran: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సమావేశానికి ఖమేనీ గైర్హాజరు..ఎందుకని?

Author Icon By Vanipushpa
Updated: February 9, 2026 • 3:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei) తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 1989లో దేశ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి.. అంటే గత 37 ఏళ్లుగా నిరంతరాయంగా పాటిస్తున్న ఒక కీలక సంప్రదాయాన్ని ఆయన మొట్ట మొదటి సారిగా పక్కన పెట్టారు. ఫిబ్రవరి 8వ తేదీన ప్రతి ఏటా నిర్వహించే ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సమావేశానికి ఖమేనీ గైర్హాజరు అయ్యారు. 1979 ఫిబ్రవరి 8వ తేదీన ఇరాన్ వాయుసేన అధికారులు పహ్లావీ రాజవంశాన్ని కూల్చి వేసేందుకు అప్పటి విప్లవ నేత రుహోల్లా ఖొమేనీకి విధేయత ప్రకటించారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ కమాండర్లు దేశ అత్యున్నత నేతను కలవడం ఆచారంగా వస్తోంది. చివరికి కరోనా మహమ్మారి సమయంలో కూడా ఖమేనీ ఈ సమావేశానికి హాజరు అయ్యారు.

Read Also: Child Safety: స్కూలు బ‌స్సులు ప‌సుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

Iran: ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సమావేశానికి ఖమేనీ గైర్హాజరు..ఎందుకని?

ట్రంప్ హెచ్చరికల ఎఫెక్టేనా?

ఖమేనీ గైర్హాజరు వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థపై ట్రంప్ గురి పెట్టడం, ఒకవేళ దాడులు జరిగితే అది మొత్తం మధ్యప్రాచ్యానికి వ్యాపిస్తుందని ఇరాన్ హెచ్చరించడం ఉద్రిక్తతలను పెంచాయి. దీనికి తగ్గట్టుగానే అమెరికా తన యుద్ధ విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ను అరేబియా సముద్రంలోకి పంపింది. అలాగే జోర్డాన్‌లోని కీలక స్థావరాలకు ఎఫ్-15 యుద్ధ విమానాలు, రీపర్ డ్రోన్లను భారీగా తరలించింది. 2025 జూన్‌లో జరిగిన 12 రోజుల ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత పరిస్థితి మరింత విషమించింది. ఇరాన్ కేవలం తన అణు కార్యక్రమంపైనే చర్చిస్తానని చెబుతుండగా.. క్షిపణి వ్యవస్థను కూడా చర్చల్లోకి తేవాలని అమెరికా పట్టుబడుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

defense news international security Iran Air Force Iran politics Khamenei absence military command military leadership strategic meetings

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.