Khaleda Zia: పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన ఖలీదా జియా

Read Time:  1 min
Khaleda Zia
Khaleda Zia
FONT SIZE
GET APP

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియా (Khaleda Zia) 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. లివర్ సిర్రోసిస్, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఢాకాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు బీఎన్‌పీ అధికారికంగా ప్రకటించింది. ఆమె మరణంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక శక్తివంతమైన అధ్యాయం ముగిసినట్టయింది.

Read also: Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Khaleda Zia

Khaleda Zia

ఖలీదా జియాకు భారత్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. ఆమె 1946లో (కొన్ని ఆధారాల ప్రకారం 1945లో) అప్పటి అవిభాజ్య భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, జల్పాయిగురిలో జన్మించారు. ఆమె తండ్రి ఇస్కందర్ మజుందార్ అక్కడ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. 1947లో దేశ విభజన అనంతరం ఖలీదా జియా కుటుంబం దినాజ్‌పూర్‌కు వలస వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమె బాల్యం, మూలాలు భారత గడ్డతో ముడిపడి ఉన్నాయి.

1960లో సైనికాధికారి జియావుర్ రెహ్మాన్‌ను వివాహం చేసుకున్న ఖలీదా జియా మొదట గృహిణిగానే జీవితం గడిపారు. అయితే 1981లో జియావుర్ రెహ్మాన్ హత్యకు గురికావడంతో ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించాల్సి వచ్చింది. 1983లో బీఎన్‌పీ నాయకత్వాన్ని చేపట్టిన ఆమె జనరల్ ఎర్షాద్ నియంత పాలనకు వ్యతిరేకంగా విపక్ష శక్తులను ఏకం చేశారు. 1991లో జరిగిన తొలి స్వేచ్ఛాయుత ఎన్నికల్లో విజయం సాధించి బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె బంగ్లాదేశ్ రాజకీయాల్లో ధ్రువతారగా నిలిచారు. ఆమె మరణంపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రపంచ నేతలు సంతాపం తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.