📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India- Pak War : భారత్ – పాక్ ఉద్రికత్తలు మధ్య ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన

Author Icon By Sudheer
Updated: May 6, 2025 • 9:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్పందించారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కొంతకాలంగా ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు

ఇరు దేశాలు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఉద్రిక్తతలు క్షమించదగినవేమీ కాదని, ఈ సమయంలో సంయమనం అత్యంత అవసరమని గుటెరస్ స్పష్టం చేశారు. పౌరులను లక్ష్యంగా చేసుకొని జరిగే దాడులు ఏ పరిస్థితుల్లోనూ సమర్థనీయమవు అని ఆయన తెలిపారు. ఇరు దేశాలనూ సంయమనం పాటిస్తూ, సైనిక చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. సైనిక మార్గం సమస్యకు పరిష్కారం కాదని, ప్రజల్లో ఉన్న భావోద్వేగాలు సహజమేనని అయితే ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు.

ఉద్రిక్తతల పరిస్థితిని దౌత్యపరమైన మార్గాల్లో పరిష్కరించేందుకు ఐరాస సిద్ధం

ఈ ఉద్రిక్తతల పరిస్థితిని దౌత్యపరమైన మార్గాల్లో పరిష్కరించేందుకు ఐరాస సిద్ధంగా ఉందని గుటెరస్ వెల్లడించారు. శాంతి నెలకొల్పేందుకు అవసరమయ్యే చర్యలకు మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. రెండు దేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి మార్గం కల్పించాలన్నదే ఐరాస లక్ష్యమని, ఈ దిశగా అందరూ చిత్తశుద్ధితో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Read Also : Mega 157 : చిరంజీవి సరసన ‘సరైనోడు’ భామ!

Google News in Telugu PAK-IND War united nations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.