జమ్ము కశ్మీర్లోని ప్రముఖ మీడియా సంస్థ కార్యాలయంలో క్యాట్రిడ్జ్లు లభించడం కలకలం రేపుతోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలతో జమ్ము కశ్మీర్ పోలీసులకు చెందిన రాష్ట్ర దర్యాప్తు సంస్థ గురువారం జమ్ము కశ్మీర్లోని కశ్మీర్ టైమ్స్ (Kashmir Times) కార్యాలయంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏకే-47 బుల్లెట్లు లభించాయి.
Read Also : America: 350 సుంకాలను విధిస్తానని చెప్పా .. అందుకే యుద్ధం ఆగింది

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం ఉదయం నుంచి చేపట్టిన సోదాల్లో ఏకే-47 బుల్లెట్లు, పిస్టల్ రౌండ్స్ మూడు గ్రనేడ్ లెవర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశం, జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా, వేర్పాటువాదానికి అనుకూల సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. అంతేకాదు కశ్మీర్ టైమ్స్ (Kashmir Times)పై ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు. ఇందులో సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ పేరును కూడా చేర్చారు. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కశ్మీర్ టైమ్స్.. జమ్ము కశ్మీర్కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ. దీన్ని వేద్ భాసిన్ స్థాపించారు. 1954లో వీక్లీగా ప్రచురణ ప్రారంభించిన ఈ పత్రిక.. ఆ తర్వాత డైలీగా మారింది.
కాశ్మీర్లో తొలి ఆంగ్ల వార్తాపత్రిక ఏది?
కాశ్మీర్ టైమ్స్. కాశ్మీర్ టైమ్స్ అనేది భారత కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ నుండి ప్రచురితమయ్యే భారతీయ ఆంగ్ల భాషా దినపత్రిక. ఇది మొదట 1954లో వారపత్రికగా ప్రచురించబడింది. 1964లో దీనిని దినపత్రికగా మార్చారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర స్థాపకుడు ఎవరు?
జమ్మూ, కాశ్మీర్ మరియు లడఖ్ అనే మూడు విభిన్న ప్రాంతాలతో కూడిన కొత్త ప్రాంతం ఏర్పడింది, దాని స్థాపకుడైన మహారాజా గులాబ్ సింగ్ దాని స్థాపకుడిగా ఉన్నారు. యుటి తూర్పున లడఖ్ మరియు ఉత్తరాన మరియు పశ్చిమాన పాకిస్తాన్తో సరిహద్దులుగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: