हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Karnataka: కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

Pooja
Karnataka: కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

కర్ణాటక(Karnataka) ఉత్తర కన్నడ జిల్లాలోని కార్వార్ తీరంలో ఉన్న భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కదంబ నావికా స్థావరం సమీపంలో చైనా జీపీఎస్ ట్రాకర్ అమర్చిన సముద్రపు పక్షి కనిపించడం భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. దేశంలోనే అత్యంత కీలకమైన నేవీ స్థావరం పరిసరాల్లో ఈ ఘటన జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Read Also:Nuclear Energy: శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

Karnataka
A Chinese GPS-equipped bird causes a stir at the Karwar naval base.

గాయపడిన సీగల్‌ను గుర్తించిన స్థానికులు

మంగళవారం కార్వార్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్ సమీపంలో ఒక వలస పక్షి (సీగల్) గాయపడిన స్థితిలో ఎగరలేక ఉండటాన్ని స్థానికులు గమనించారు. పక్షి వెనుకభాగంలో ఓ వింత పరికరం అమర్చిఉండటంతో అనుమానం వచ్చిన వారు వెంటనే కోస్టల్ మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పక్షిని స్వాధీనం చేసుకుని అటవీ శాఖకు అప్పగించారు.

చైనీస్ భాషలో వివరాలు ఉన్న ట్రాకర్ గుర్తింపు

అటవీ శాఖ అధికారులు పరిశీలించగా, ఆ పక్షి శరీరానికి జీపీఎస్ ట్రాకింగ్ పరికరం, చిన్న సోలార్ ప్యానెల్ అమర్చిఉన్నట్లు గుర్తించారు. ఆ ట్రాకర్‌పై చైనీస్ భాషలో ఒక ఈమెయిల్ ఐడీ ఉండగా, అది చైనాలోని ‘రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకో-ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్’కు చెందినదిగా నిర్ధారణైంది. అందులో “ఈ పక్షి కనిపిస్తే దయచేసి ఈ ఈమెయిల్‌కు సమాచారం ఇవ్వండి” అనే సందేశం కూడా ఉంది.

గూఢచర్యం అనుమానాల మధ్య అధికారులు దర్యాప్తు

ఆసియాలోనే అతిపెద్ద నావికా స్థావరంగా పేరొందిన ఐఎన్ఎస్ కదంబ సమీపంలో చైనా పరికరంతో కూడిన పక్షి కనిపించడంతో ఇది గూఢచర్యానికి సంబంధించినదేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రాథమిక విచారణలో ఇది వలస పక్షుల ప్రయాణ మార్గాలు, ఆహారపు అలవాట్లపై పరిశోధనలో భాగంగా అమర్చిన ట్రాకర్ కావచ్చని అధికారులు భావిస్తున్నారు.

శాస్త్రీయ పరిశోధనా? భద్రతా ముప్పా?

ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ దీపన్ ఎంఎన్ మాట్లాడుతూ,
“ఇది వలస పక్షులపై శాస్త్రీయ అధ్యయనానికి ఉపయోగించిన పరికరమా, లేక భద్రతకు ముప్పు కలిగించే అంశమా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. సంబంధిత చైనా పరిశోధనా సంస్థను కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం” అని తెలిపారు.

గత ఏడాది ఇదే ప్రాంతంలో ఒక డేగకు ట్రాకింగ్ పరికరం అమర్చిఉండటం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పట్లో అది వన్యప్రాణి పరిశోధనలో భాగమేనని అధికారులు నిర్ధారించారు. తాజా ఘటనలో ఈ సీగల్ పక్షి సుమారు 10,000 కిలోమీటర్లు ప్రయాణించి కార్వార్ తీరానికి చేరుకున్నట్లు సమాచారం. జీపీఎస్ పరికరాన్ని సాంకేతిక పరీక్షల కోసం పంపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ఒప్పుకున్న ప్రధాని షెహబాజ్ షరీఫ్

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పై కుట్ర జరుగుతోందా?

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పై కుట్ర జరుగుతోందా?

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

📢 For Advertisement Booking: 98481 12870