📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా పూరీ, ఉజ్జయిని ఆలయాలు ఎందుకు దర్శించింది?

Author Icon By Sharanya
Updated: May 24, 2025 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల భారత భద్రతా వ్యవస్థను దెబ్బతీసే విధంగా పాకిస్థాన్ నిఘా సంస్థలకు దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా దేశీయ యూట్యూబర్‌గా పర్యాటక వీడియోల ద్వారా గుర్తింపు పొందిన ఆమె, సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై మల్హోత్రా కేసు విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి.  గతంలో పూరీ జగన్నాథ ఆలయంతో పాటు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని కూడా సందర్శించినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా, పూరీ ఆలయంపై డ్రోన్ ఎగరవేయడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

పూరీ జగన్నాథ ఆలయంలో డ్రోన్ కలకలం

జ్యోతి మల్హోత్రా పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆమె ఆలయ పరిసరాల్లో డ్రోన్‌ను ఎగురవేసినట్లు అధికారులు గుర్తించారు. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల దృష్టి ఉందంటూ ఇటీవల కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆలయంపైకి డ్రోన్‌ను ఎందుకు పంపారు, దాని ద్వారా ఎలాంటి దృశ్యాలను చిత్రీకరించారు అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయ సందర్శనపై దర్యాప్తు

జ్యోతి మల్హోత్రా గత ఏడాది ఏప్రిల్ నెలలో ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని కూడా సందర్శించినట్టు మధ్యప్రదేశ్ పోలీసులు ధృవీకరించారు. అయితే, అక్కడి విచారణలో ఇప్పటివరకు ఎలాంటి నేరారోపణలు నిర్ధారణ కాలేదని, ఆమె ఏయే ప్రాంతాలకు వెళ్లింది, ఎక్కడ బస చేసింది అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. జ్యోతి మల్హోత్రా పర్యాటక యూట్యూబర్గా దేశంలోని పలు ప్రదేశాలకు వెళ్లి వీడియోలు చేయడాన్ని నిఘా సంస్థలు ఇప్పుడు శంకతో చూస్తున్నాయి.

Read also: Schizophrenia: ఆందోళన కలిగిస్తున్న స్కిజోఫ్రీనియా రుగ్మత

#DroneViolation #JagannathTemple #JyotiMalhotra #MahakaleshwarTemple #SocialMediaInfluencer #TempleSecurity #YouTuberControversy Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.