ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో ఇప్పటివరకు అతి పెద్ద సర్ప్రైజ్గా నిలిచిన జట్టు ఒమన్.తమ క్రికెట్ అభివృద్ధి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైపు ఆశగా చూస్తోంది. తమకు భారత్లో శిక్షణ అవకాశాలు కల్పించి, అండగా నిలవాలని ఆ జట్టు కెప్టెన్ జతిందర్ సింగ్ (Jatinder Singh) బీసీసీఐని అభ్యర్థించాడు.గతరాత్రి అబుదాబిలో జరిగిన మ్యాచ్లో భారత్పై కేవలం 21 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, ఒమన్ జట్టు ప్రదర్శించిన పోరాట పటిమపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఈ మ్యాచ్ అనంతరం, ఒమన్ జట్టు కెప్టెన్ (Captain of the Oman team) జతిందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తన జట్టు ప్రదర్శనపై గర్వం వ్యక్తం చేశారు. భారత మూలాలున్న ఈ ఆటగాడు, యువ క్రికెటర్ల ప్రతిభపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. “మా జట్టు ఇప్పటికీ అభివృద్ధి దశలో ఉంది. కానీ ఈ మ్యాచ్ ద్వారా మా ఆటగాళ్లలోని ధైర్యం, నైపుణ్యం బయటపడింది” అని చెప్పారు.

మా ఆటగాళ్ల నైపుణ్యాలకు పదును పెట్టుకోవచ్చు
అలాగే, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మ్యాచ్ సమయంలో ఇచ్చిన చిన్న చిన్న సలహాలు తమ జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయని, ఆ సలహాల ద్వారా యువ ఆటగాళ్లు మరింత ధైర్యంగా ఆడగలిగారని జతిందర్ వివరించారు. “మాకు భారత్లో శిక్షణ పొందే అవకాశం కల్పిస్తే ఎంతో మేలు జరుగుతుంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (National Cricket Academy) (ఎన్సీఏ)లో మా ఆటగాళ్ల నైపుణ్యాలకు పదును పెట్టుకోవచ్చు.అలాగే, భారత దేశీయ జట్లతో మ్యాచ్లు ఆడే ఏర్పాటు చేస్తే మాకు మరింత అనుభవం వస్తుంది” అని వివరించాడు.అసోసియేట్ దేశం కావడంతో పెద్ద జట్లతో ఆడే అవకాశాలు తమకు చాలా తక్కువగా లభిస్తాయని జతిందర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి గొప్ప వేదికలని పేర్కొన్నాడు. బీసీసీఐ (BCCI) తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.గతంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు (Afghanistan cricket team) కు బీసీసీఐ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ జట్టుకు భారత్ను హోమ్ గ్రౌండ్గా వాడుకునేందుకు అనుమతించడంతో పాటు పలు సౌకర్యాలు కల్పించింది. ఇప్పుడు ఒమన్ కూడా అలాంటి చేయూతనే ఆశిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: