జపాన్ (Japan) పార్లమెంటును రద్దు చేశారు ప్రధానమంత్రి సనాయె తకాయిచి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు నెలలకే తకాయిచి కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ప్రతినిధుల సభను రద్దు చేసి, ఫిబ్రవరి 8న ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించినట్లు స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. తన ఆర్థిక భద్రతా విధాన ఎజెండాకు ప్రజల మద్దతు కోరుతూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 465 మంది సభ్యులున్న దిగువ సభను రద్దు చేసి, ఈ నిర్ణయం తీసుకోవడం 60 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నిర్ణయంతో జపాన్లో తక్కువ సమయంలోనే హోరాహోరీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
ప్రస్తుత చట్టసభ్యుల పదవీకాలం 2028 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, తాను ఇంకా ప్రజల నుంచి నేరుగా మద్దతు పొందలేదని తకాయిచి పేర్కొన్నారు. అందుకే ప్రజల తీర్పును కోరేందుకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వివరించారు.
Read Also: Canada: దావోస్లో కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలకు వెనక్కి తగ్గిన ట్రంప్
కొత్త కూటమిని ఏర్పాటు
మరోవైపు, ఈ ఎన్నికల్లో కొత్త ప్రతిపక్ష కూటమి కూడా రంగప్రవేశం చేయనుంది. జపాన్ రాజ్యాంగ ప్రజాస్వామ్య పార్టీ, కోమెయిటో పార్టీ కలిసి ‘సెంట్రిస్ట్ రిఫార్మ్ అలయన్స్’ పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా జపాన్లో పెరుగుతున్న జీవన వ్యయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే ఆహార పదార్థాలపై ఉన్న వినియోగ పన్నును తగ్గించే అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు హామీలు ఇస్తున్నాయి. అధికార పార్టీ పన్నును తాత్కాలికంగా నిలిపివేయాలని భావిస్తుండగా, ప్రతిపక్షం పూర్తిగా దాన్ని రద్దు చేయాలని ప్రతిపాదిస్తోంది. ఇక రాజకీయ నిధుల అంశం కూడా ఎన్నికల్లో కీలకంగా నిలవనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: