📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Japan:ఎలుగుబంట్ల ఉధృతి ప్రజల భద్రత కోసం ప్రభుత్వ రంగ ప్రవేశం

Author Icon By Pooja
Updated: November 9, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జపాన్‌లో(Japan) ఇటీవల ఎలుగుబంట్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది, ముఖ్యంగా అకిటా ప్రావిన్స్‌లో వీటి విస్తృతి ఎక్కువగా ఉంది. అడవుల్లో ఆహార కొరత కారణంగా భల్లూకాలు తరచూ గ్రామాలు, పట్టణ ప్రాంతాలవైపు వస్తున్నాయి. ఫలితంగా, మనుషులపై దాడులు సాధారణంగా మారిపోయాయి. గత ఆరు నెలల్లోనే వందకు పైగా దాడులు చోటుచేసుకుని, 13 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ఈ పరిస్థితి ప్రజల్లో తీవ్ర భయాన్ని కలిగించడంతో ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది.

Read Also: Earthquake: అండమాన్‌& నికోబార్ దీవుల్లో భారీ భూకంపం

ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభం
ఎలుగుబంట్లను పట్టుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్(Japan) ప్రారంభించింది. వేటగాళ్లతో పాటు సైన్యాన్ని కూడా ఈ ఆపరేషన్‌లో భాగం చేసింది. భల్లూకాలను బంధించడానికి బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు, వాటి తరలింపులో సైనికులు సహకరిస్తారు. అయితే, వాటిని చంపడానికి తుపాకులు వినియోగించరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

కాల్పులకు పరిమిత అనుమతి
అకిటా మరియు ఇవాటే ప్రావిన్సుల్లో మాత్రం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎలుగుబంట్లపై కాల్పులు జరపడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. వేటగాళ్లు స్పందించలేని పరిస్థితుల్లో సైన్యం కాల్పులు జరపవచ్చని తెలిపింది. అలాగే, గిఫు ప్రావిన్సులో డ్రోన్ల(Drones in the province) సాయంతో భల్లూకాలను భయపెట్టే శబ్దాలను సృష్టించి వాటిని దూరంగా తరిమేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వృద్ధికి కారణాలు
వాతావరణ మార్పులు, శీతాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు, ఆహార వనరుల కొరతతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు తగ్గిపోవడం వల్ల పండ్ల చెట్లు విపరీతంగా పెరగడం ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఎలుగుబంట్ల ప్రస్తుత స్థితి
1990లలో ప్రభుత్వం సంరక్షణ చర్యలు ప్రారంభించిన తర్వాత ఎలుగుబంట్ల సంఖ్య వేగంగా పెరిగింది. ప్రస్తుతం హెన్షూ ద్వీపంలో సుమారు 42,000, హొక్కైడో ద్వీపంలో 12,000 ఎలుగుబంట్లు ఉన్నట్లు అంచనా.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Akita Prefecture Bear Attacks Japan Wildlife Latest News in Telugu Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.